నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించాలి

నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించాలి నీటి కొరత ఏర్పడే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలి తాలిపేరు ప్రాజెక్టును సంద‌ర్శించిన కలెక్టర్‌ అంకిత్‌ కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, తాలిపేరు ప్రాజెక్టులో నీటిమట్టం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బుధవారం చర్లలోని తాలిపేరు ప్రాజెక్టు, ఏకలవ్య మోడల్‌ పాఠశాలను కలెక్టర్‌...