సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు పైలాన్, నూతన కలెక్టరేట్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కాకతీయ, ములుగు ప్రతినిధి : ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి ములుగు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేసి, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్...