గిరిజన రిజర్వేషన్ల పెంపు కేసీఆర్‌ ఘనతే

గిరిజన రిజర్వేషన్ల పెంపు కేసీఆర్‌ ఘనతే గిరిజనుల అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ పెద్దపీట కాంగ్రెస్‌ హామీలపై స్పష్టత ఇవ్వాలి బీఆర్‌ఎస్‌ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి కాకతీయ, ములుగు ప్రతినిధి : గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్‌ఎస్‌ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి అన్నారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట...