ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్‌ ఏకగ్రీవ ఎన్నిక

ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్‌ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షుడిగా కుంభం మహేందర్‌రెడ్డి కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల నూతన ప్రెస్‌క్లబ్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుంభం మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా షేక్‌ యాకుబ్‌ పాషా, ప్రధాన కార్యదర్శిగా దార్ల భాస్కర్‌, కోశాధికారిగా జాటోత్‌ సంతోష్‌, సంయుక్త కార్యదర్శిగా కూటికంటి మధును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గాడుదుల గణేష్‌, పల్లె రాజు, మోహన్‌, ప్రభాకర్‌, బిక్షపతి పాల్గొన్నారు.