ఏధిర పీహెచ్సీలో ఐటీడీఏ పీవో తనిఖీ
ఏధిర పీహెచ్సీలో ఐటీడీఏ పీవో తనిఖీ వైద్య సేవలు, సిబ్బంది హాజరుపై పరిశీలన కాకతీయ, ఏటూరునాగారం : నూగూరు వెంకటపురం మండలం ఏధిర గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టొప్పో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, వ్యాక్సిన్ల భద్రత, రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి, వైద్య సేవల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలను తెలుసుకున్నారు. సిబ్బంది క్రమం తప్పకుండా...