epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ!

కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ!
రూ.151 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ
రూ.23 కోట్లతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్
రూ.60 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ భవనం
రూ.4 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్
గీతా వృత్తిదారులకు కాటమయ్య రక్షణ కవచాలు
ప్ర‌జా సంక్షేమమే ప్ర‌భుత్వం లక్ష్యం : మంత్రులు పొన్నం, సీత‌క్క‌

కాక‌తీయ‌, మ‌హ‌బూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో రూ.151 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు *వేం నరేందర్ రెడ్డి*తో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, రాష్ట్ర ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్ తదితరులు పాల్గొన్నారు. కేసముద్రం మండల కేంద్రంలో రూ.23 కోట్లతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.60 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ భవన నిర్మాణానికి, రూ.4 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. బస్ స్టేషన్ భూమి కోర్టు కేసుల్లో ఉండటాన్ని పరిష్కరించి శంకుస్థాపన చేయడం విశేషమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మౌలిక సదుపాయాల విస్తరణ

కేసముద్రం మున్సిపాలిటీలో రూ.61.86 లక్షలతో రోడ్లు, డ్రైనేజీతో పాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.2 కోట్లతో సేవలాల్ సంత్ బంజారా భవన నిర్మాణానికి కూడా భూమిపూజ చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేలా రోడ్ సేఫ్టీ క్లబ్ లోగోను మంత్రులు ఆవిష్కరించారు. గీతా వృత్తిదారులకు రూ.53.40 లక్షల విలువైన కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేశారు. తమ గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసముద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభినందించి సత్కరించారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, గిరిజన ప్రాంతాలకు మరో వెయ్యి ఇళ్లు అదనంగా ఇచ్చామని చెప్పారు. ఉచిత ఇసుకగా ఎనిమిది ట్రాక్టర్లు అందిస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.9 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డులు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని, మిగిలిన హామీలను కూడా రాబోయే రోజుల్లో అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రారంభించిన మంచి కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మొత్తానికి, కేసముద్రం మండల కేంద్రం వందల కోట్ల అభివృద్ధి పనులతో కొత్త రూపు దాలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.