epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేసీఆర్‌కు నోటీసులు

కేసీఆర్‌కు నోటీసులు

నందిన‌గ‌ర్ నివాసానికి సిట్ బృందం

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచ‌ల‌నం

రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విచార‌ణ‌

65 ఏండ్లు దాటినందున కోరిన చోటే విచార‌ణ‌

ఇప్ప‌టికే కేటీఆర్‌, హ‌రీష్‌, సంతోష్‌రావుల విచార‌ణ‌

మండిప‌డుతున్న బీఆర్ఎస్ శ్రేణులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా క్షేత్రస్థాయిలో ఆధారాలను సేకరించిన సిట్ అధికారులు.. నేరుగా కేసీఆర్‌ను విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన పీఏకు నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 65 ఏళ్లు పైబడిన దృష్ట్యా కేసీఆర్‌కు విచారణ సమయంలో స్టేషన్ హాజరు ప్రత్యేక మినహాయింపునిచ్చారు. జూబ్లీహిల్స్ స్టేషన్‌కు రావొచ్చు లేదంటే.. హైదరాబాద్‌లోని మరో ప్రాంతాన్ని సూచించవచ్చునని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలను సిట్ విచారించింది. మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావును అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి సేకరించిన వివరాలు, అలాగే ప్రస్తుతం జైలులో ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్‌ను విచారించాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల వినియోగం, రాజకీయ నేతల ఫోన్ల నిఘాపై ప్రధానంగా ఈ విచారణ సాగనున్నట్లు తెలిసింది.

దర్యాప్తు వేగవంతం

రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేయగా, ప్రభాకర్ రావును సైతం పలుమార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఈ కేసులో చిన్న చిన్న గ్యాప్స్​ను కూడా ఫిల్‌ చేస్తూ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ముందుకు వెళ్తోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ కస్టోడియల్ విచారణ ఆధారంగా కీలక సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే ట్యాపింగ్ బాధితులుగా ఉన్న మొత్తం 618 మందిని దాదాపు అందరి స్టేట్మెంట్​ను రికార్డ్ చేసిన సిట్ అధికారులు, ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ తర్వాత మరికొంతమందిని పిలిచి విచారిస్తున్నారు.

ఎస్​ఐబీ ఏఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుతో

2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు అనేక కీలక మలుపులు తిరుగుతూ, అక్రమ నిఘాకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను వెలుగులోకి తెచ్చింది. వీసీ సజ్జనార్ నాయకత్వంలో మరో సిట్ ఏర్పాటు చేసిన తర్వాత దర్యాప్తు మరింత వేగవంతమైంది. దీని తర్వాత సిట్ ఇటీవల ఎమ్మెల్సీ నవీన్ రావు, మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌లను విచారించింది. వారి వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు, విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీశారు. అనేక వాంగ్మూలాల్లో కేసీఆర్ పేరు వెలుగులోకి రావడంతో, ఇప్పుడు ఆయనకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పాత్ర గురించి ప్రస్తావించినట్లు ఆరోపణలు వచ్చాయి. భుజంగ రావు కూడా ప్రభాకర్ రావు నియామకం గురించి ప్రస్తావిస్తూ కేసీఆర్ పేరు చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో పాలుపంచుకున్న సీనియర్ అధికారులు సంబంధిత కాలంలో మాజీ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ను తరచుగా సందర్శించారని భుజంగ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ వాంగ్మూలాలు, వాటికి మద్దతుగా లభించిన ఆధారాల ఆధారంగా సిట్ తన దర్యాప్తును ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడంతో దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

ఇటీవలే కేటీఆర్​ను లోతుగా విచారించిన సిట్

ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్​ను ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందం లోతుగా విచారించింది. ఆయనను పలు అంశాలపై అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్లు, విరాళాలు సమకూర్చిన వారిలో పలువురు వ్యాపారుల మొబైల్స్​ నిఘాలో ఉన్నట్లుగా సిట్​కు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లుగా తెలిసింది. ఆయా ఫోన్​ నెంబర్లతో ఉన్న జాబితాను కేటీఆర్​ ముందు ఉంచి విచారించినట్లు సమాచారం. అలాగే ఫోన్​ ట్యాపింగ్​ ద్వారా తమను బెదిరించి బీఆర్​ఎస్​కు ఎలక్ట్రోరల్​ బాండ్లు సమకూర్చే విధంగా చేశారంటూ కొంతమంది వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని కేటీఆర్​ సమాధానం ఇచ్చారు. వ్యాపారులు తమకు స్వచ్ఛందంగానే విరాళాలను ఇచ్చారని చెప్పినట్లు సమాచారం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.