epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నర్సంపేటలో బీజేపీ బల ప్రదర్శన

నర్సంపేటలో బీజేపీ బల ప్రదర్శన
30 వార్డుల్లో నామినేషన్లతో రంగంలోకి కమలం
నిజాయితీగల అభ్యర్థులకే ప్రజల ఆశీర్వాదం కావాలి
మున్సిపాలిటీ అభివృద్ధే బీజేపీ లక్ష్యం
కార్యకర్తల ఐక్యతతో ఘన విజయం సాధిస్తాం
వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్

కాకతీయ, నర్సంపేట : మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకున్న వేళ నర్సంపేట మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ బలమైన ఉనికిని చాటింది. మొత్తం 30 వార్డుల నుంచి బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో పట్టణ రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. నర్సంపేటను అభివృద్ధి పథంలో నడిపించాలంటే నిజాయితీ, సేవాభావం కలిగిన బీజేపీ అభ్యర్థులకే ప్రజలు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, కంభంపాటి పుల్లారావు అభ్యర్థి తదితర జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు అందజేసి, వారి వెంట నామినేషన్ల దాఖలులో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

అభివృద్ధే అజెండా

ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ… నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళిక బీజేపీ వద్ద సిద్ధంగా ఉందని చెప్పారు. మాటలకే పరిమితం కాకుండా, అమలు చేసే రాజకీయమే బీజేపీ ప్రత్యేకత అని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని, అదే అభివృద్ధి ఫలాలు స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు అందాలంటే మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

నిజాయితీగల పాలనకే ఓటు

బీజేపీ నాయకులు మాట్లాడుతూ… అవినీతి, అనైతిక రాజకీయాలకు నర్సంపేట ప్రజలు విసిగిపోయారని అన్నారు. మున్సిపాలిటీ స్థాయిలో పారదర్శక పాలన తీసుకురావాలంటే నిజాయితీగల బీజేపీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరారు. ప్రతి వార్డులో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా పనిచేసే అభ్యర్థులను బీజేపీ రంగంలోకి దింపిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులంతా ఐక్యంగా పనిచేయాలని, వ్యక్తిగత ప్రయోజనాలకంటే పార్టీ, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని నాయకత్వం సూచించింది.

ఇంటింటి ప్రచారానికి పిలుపు

రాబోయే రోజుల్లో ప్రచారం మరింత ఉధృతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి బీజేపీ విధానాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసి, మున్సిపాలిటీలో మార్పు తీసుకురావాల్సిన అవసరాన్ని వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహా రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రే శ్రీనివాస్, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షుడు తనుగుల అంబేద్కర్, జిల్లా ఇన్చార్జీలు, పదాధికారులు, నియోజకవర్గ నాయకులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.