epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీఎం విహారయాత్ర సభ

సీఎం విహారయాత్ర సభ
ఎన్నికల‌కోడ్ ఉల్లంఘిస్తూ న‌ర్సంపేట‌లో ప‌ర్య‌ట‌న‌
గుర్తు లేకుండా జ‌రిగే ఎన్నిక‌ల్లో సీఎం ప్ర‌చారం
ఇంత దిగ‌జారి ప్ర‌చారం చేసిన ముఖ్య‌మంత్రి ఎవ‌రూ లేరు
రాష్ట్ర ప్ర‌భుత్వానికి తొత్తులా ఎన్నిక‌ల క‌మిష‌న్ తీరు
న‌ర్సంపేట‌కు ఏం చేస్తార‌ని చెప్ప‌కుండా ముగిసిన సీఎం ప్ర‌సంగం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

కాకతీయ, నర్సంపేట : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నర్సంపేటకు ఏమీ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. నర్సంపేటలో నిర్వహించిన సభ విజయోత్సవ సభ కాదని, విహారయాత్ర సభ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హెలిపాడ్‌ ల్యాండింగ్ రాజుపేట ప్రాంతంలో ఎన్నికల కోడ్‌కి విరుద్ధమైనా, తాము ఏ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కానీ ప్రభుత్వం అడుగడుగునా ఎన్నికల నియమావళి ఉల్లంఘించిందన్నారు. రెండు సంవత్సరాలుగా నర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అడ్డ‌గోలుగా హామీలు గుమ్మ‌రించేందుకు సీఎం ప‌ర్య‌ట‌న పెట్టుకున్నార‌ని అన్నారు. “ప్రజలు ఎదురు చూసింది అభివృద్ధి… కానీ నర్సంపేట కు వచ్చినది గాడిద గుడ్డే” అని మండిపడ్డారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం ముఖ్యమంత్రి స్థాయిలో ప్రచారం చేయడం అవమానకరం అని వ్యాఖ్యానిస్తూ, “ఇలాంటి సీఎం మరెప్పుడూ చూడలేదు” అన్నారు. ప్రత్త్యక్ష ప్రచారం లేని ఎన్నికలు అని ఎన్నికల కమిషన్ రేవంత్ రెడ్డికి ఏజెంట్‌లా వ్యవహరిస్తోందని విమర్శించారు.

మెడికల్ కాలేజ్‌కు రెండోసారి శంకుస్థాపన చేయడం సిగ్గుచేటు

“ఎమ్మెల్యే హోదాలో ఉండి మెడికల్ కాలేజ్‌కు రెండోసారి శంకుస్థాపన చేయడం సిగ్గుచేటని పెద్ది ధ్వ‌జ‌మెత్తారు. రెండోసారి శంకుస్థాపన చేయడం విడ్డూరం. మెడికల్ కాలేజ్, హాస్పిటల్ నేను ఉన్నప్పుడు వచ్చినవి. ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం తగదు” అని అన్నారు. నర్సంపేట రింగ్ రోడ్ ప్రణాళిక కూడా తానే ప్రతిపాదించానని, ప్రస్తుత ఎమ్మెల్యే క్రెడిట్‌ తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే రింగ్ రోడ్‌కు రూ.5 కోట్ల టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ యంత్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం మరచిపోయిందని, అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తుఫాన్ ప్రభావంతో వరి, మొక్కజొన్న పంటలు నష్టపోయినా ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. “కేసీఆర్ ప్రభుత్వం కాలంలో పంటలకు నీరు, కరెంట్, రైతు బంధు, ధాన్యం కొనుగోలు— అన్నీ అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు రైతులు యూరియా కోసం కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయోత్సవ సభ పెట్టడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు. గత సీజన్‌లో 1260 కోట్లు రైతులకు బకాయిలుగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకోవడం అన్యాయమన్నారు. రేవంత్ రెడ్డి సభ మొత్తం “చీరెల మీదే కార్యక్రమం నడిచింది” అని విమర్శించారు. అభివృద్ధి గురించి ప్రజలకు ఏ స్పష్టమైన హామీ కూడా ఎక్కడా కనిపించలేదని, ప్రజలు అయోమయంలో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని, రైతులకు అండగా నిలబడేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.