epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతు భరోసాకు ‘బీఆర్‌ఎస్‌’ పాదయాత్ర

రైతు భరోసాకు ‘బీఆర్‌ఎస్‌’ పాదయాత్ర
త్వరలోనే ప్రణాళిక విడుదల చేస్తాం
కాంగ్రెస్ సర్కారు మోసాలను ఇంటింటికీ వివరిస్తాం
మిల్లుల వద్ద రైతుల అవస్థలు.. తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ
ప్రజా సమస్యలు వదిలి నాయకుల కొనుగోళ్లపైనే ప్రభుత్వ ధ్యాస
: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

కాక‌తీయ‌, మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిట్టనిలువునా మోసం చేస్తోందని, రైతుల్లో భరోసా నింపేందుకు త్వరలోనే జిల్లాలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ మండలం రాంరెడ్డిగూడెం మిల్లు వద్ద ధాన్యం విక్రయించేందుకు వాహనాల్లో వేచి చూస్తున్న రైతులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా ప్రతి రైతును కలిసి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడతామని, త్వరలోనే పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి కార్యాచరణను విడుదల చేస్తామని వెల్లడించారు.

రైతు సమస్యలపై పోరాటమే లక్ష్యం
రైతులకు గిట్టుబాటు ధర, సకాలంలో యూరియా, కరెంటు, రైతుబంధు అందించడంతో పాటు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. “రైతు భీమా అమలు చేయాలి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి. రైతుల సమస్యలు పట్టించుకోని ఈ ప్రభుత్వంపై ప్రజలందరినీ కలుపుకొని పోరాటం చేస్తాం. రైతులు ఎవరూ అధైర్యపడవద్దు, ప్రభుత్వం ధాన్యం కొనే వరకు మీ వెంటే ఉంటాం” అని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ వరంగల్ సభ ప్రకటన రాగానే భయంతో పాత పద్ధతిలో కొనుగోళ్లు ప్రారంభించారని, అయితే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల మిల్లర్లు తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. మిల్లుల వద్ద రైతుల నుంచి 40 కేజీలకు 3 నుంచి 4 కిలోల వరకు తరుగు తీస్తున్నారని, దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారని, కరెంటు, యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్లాల వద్దే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి, సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించామని ఆయన గుర్తు చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సర్పంచులు, కార్పొరేటర్లు, ఇతర నాయకులను డబ్బుతో కొనాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. రైతులకు యూరియా, కరెంటు ఇవ్వకుండా, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ‘రైతు వారోత్సవాలు’ చేస్తోందో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సైకిళ్లపై ప్రచారం చేయండి!

సైకిళ్లపై ప్రచారం చేయండి! అభ్యర్థులకు మంత్రి జూపల్లి వినూత్న సూచన ఆరోగ్యంతో పాటు ప్రజల్లో...

యూరియా స‌ర‌ఫ‌రాకు లంచం డిమాండ్‌

యూరియా స‌ర‌ఫ‌రాకు లంచం డిమాండ్‌ ఏసీబీకి అడ్డంగా బుక్కైన వనపర్తి జిల్లా వ్య‌వ‌సాయ‌శాఖ...

Kondareddypalli: సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి శ్రీ...

Child Tragedy: విషాదం.. మట్టి గోడ కూలి బాలుడు మృతి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామంలో...

సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వీ రామారావు కన్నుమూత.!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ రచయిత సాహిత్య విమర్శకులు ఆచార్య ఎస్వీ...

Bhu Bharati: లంచం కోసం అధికారుల వేధింపులు..ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భూ సంస్కరణలు ఎన్నో చేసినా, ప్రజలు...

రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే: జూపల్లి సంచలన వ్యాఖ్యలు

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఇందిరమ్మ నమూనా గృహం...

వలసల పాలమూరును విద్య, పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, మహబూబ్‌నగర్ : దశాబ్దాల కరవు, వలసలు, వెనుకబాటుతనం నుంచి బయటపడి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.