రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి
ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజారెడ్డి
కాకతీయ, నల్లబెల్లి : రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజారెడ్డి ఆదేశించారు. గురువారం మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు, ఆసుపత్రి నిర్వహణను పరిశీలించారు. వివిధ రికార్డులను తనిఖీ చేసి వైద్య సేవల సూచికలు, ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల సాధనపై సిబ్బందితో సమీక్షించారు. ప్రతి విభాగం నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకునేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రికార్డుల నిర్వహణలో పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వం పాటించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని డాక్టర్ బి. రాజారెడ్డి సూచించారు.

