epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టెక్స్టైల్ పార్క్ ప‌నుల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌లం

టెక్స్టైల్ పార్క్ ప‌నుల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌లం
వరద కాలువ ప‌నులు అర్ధాంత‌రంగా నిలిపివేత‌
రూ.160 కోట్ల పనులకు ఎందుకు బ్రేక్ వేశారు..
నిధుల్లేవన్న సాకుతో ప‌నులు ప‌క్క‌న పెట్టేశారు
అసమర్థ పాలనకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

కాకతీయ, గీసుగొండ : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో వరద కాలువల బలోపేతానికి సంబంధించిన అత్యంత కీలక పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థాంతరంగా నిలిపివేయడం దురదృష్టకరమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు. పరిశ్రమల శాఖ జీఓ నెం.167 ప్రకారం రూ.160.92 కోట్లకు పరిపాలనా ఆమోదం ఇచ్చి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించిన తర్వాత ఇప్పుడు వాటిని నిలిపివేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వర్షాకాలంలో వరద ముంపును నివారించేందుకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని, గత రెండు వర్షాకాలాల్లో టెక్స్టైల్ పార్క్ పూర్తిగా మునిగిపోవడంతో ఈ పనులకు మరింత ప్రాధాన్యత ఏర్పడిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని హెచ్చరించారు. వరదల భయంతో ఇప్పటికే పరిశ్రమల సిబ్బంది ఆందోళన చెందుతున్నారని, కొత్త పరిశ్రమలు రావాలంటే పెట్టుబడిదారులు భయపడుతున్న పరిస్థితి నెలకొందని ధర్మారెడ్డి తెలిపారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా వరద కాలువల పనులను నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందని మండిపడ్డారు. ఖాతా వివరాలు అందలేదన్న కారణం చూపి పనులు నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో గొప్పలకు వెళ్లి టెండర్ల పేరుతో శంకుస్థాపనలు చేసి, ఇప్పుడు నిధులు లేవని చెప్పి పనులు ఆపేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. పరిశ్రమల భద్రత, వేలాది కార్మికుల ఉపాధి, ప్రాంత అభివృద్ధిని తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించడం సరికాదని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి వరద కాలువల బలోపేత పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరిశ్రమల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని హెచ్చరించారు.

యంగ్ వన్ కంపెనీని సందర్శించిన ధర్మారెడ్డి

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లోని యంగ్ వన్ కంపెనీని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యంతో కలిసి పరిశ్రమలో కొనసాగుతున్న ఉత్పత్తి ప్రక్రియలు, కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలు, ఉపాధి అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్క్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన కుటుంబాలకు, స్థానికులకు ఉపాధి అవకాశాల్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ, సంగెం మండలాల మాజీ జడ్పీటీసీలు పోలీసు ధర్మారావు, గూడ సుదర్శన్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చల్లా వేణుగోపాల్ రెడ్డి, పూండ్రు జైపాల్ రెడ్డి, బోడకుంట్ల ప్రకాష్, ముంత రాజయ్య, గుర్రం రఘు, పులి సారంగపాణి, యూత్ నాయకులు సిరీషే శ్రీకాంత్, గోనె నాగరాజు, అజార్, గాలి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.