పీడీఎస్ బియ్యం నిల్వచేసిన వ్యక్తి అరెస్ట్
కాకతీయ, పరకాల : పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నాగారం గ్రామంలో జలిగపు మహేందర్ ఇంటిపై దాడి నిర్వహించి 12 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం విలువ సుమారు రూ. 42,000/-గా అంచనా వేశారు. పట్టుబడిన నిందితుడు, స్వాధీనం చేసిన బియ్యాన్ని పరకాల పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్లో ఏసీపీ మధుసూదన్, ఇన్స్పెక్టర్ రాజు, ఆర్ఎస్ఐ భానుప్రకాశ్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

