epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దేవుడి సొమ్ముకే ఎసరు

దేవుడి సొమ్ముకే ఎసరు
గుడివాడ‌లో ఘరానా మోసం వెలుగులోకి
దేవ‌డి కిరీటం బ్యాంకులో తాక‌ట్టు..
రూ.70 లక్షల కిరీటం.. రూ.35 ల‌క్ష‌ల‌కు తాకట్టు
డ‌బ్బుల‌ను సొంత వ్యాపారాలకు వాడుకున్న క‌మిటీ స‌భ్యులు
దాత మాటూరు సుబ్బారావు ఆవేద‌న‌
కాక‌తీయ‌, ఏపీ బ్యూరో : భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వరస్వామికి సమర్పించిన బంగారు కిరీటాన్ని తాకట్టు పెట్టి, ఆ వచ్చిన సొమ్ముతో ఆలయ కమిటీ సభ్యులు సొంత వ్యాపారాలు చేసుకుంటున్న ఘోర అవినీతి ఉదంతం వెలుగులోకి వచ్చిందని దాత మాటూరు సుబ్బారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడలోని ప్రసిద్ధ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పాలక వర్గ సభ్యులు భక్తుల నమ్మకాన్ని నట్టేట ముంచుతూ ఈ ఘరానా మోసానికి తెరలేపారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించి తీవ్ర ఆగ్రహానికి గురైన దాతలు, స్థానిక భక్తులు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆలయ కమిటీ సభ్యులపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. గత 2025 లో తానే స్వయంగా ఎంతో పవిత్రంగా, భక్తితో రూ.70 లక్షల భారీ వ్యయంతో స్వామివారికి ఈ బంగారు కిరీటాన్ని చేయించి సమర్పించినట్లు దాత వివరించారు. దేవుడి ఆభరణాన్ని దేవుడికే అలంకరించకుండా సొంత లాభాల కోసం వాడుకోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
   వివ‌రాలు వెల్ల‌డిస్తున్న దాత మాటూరు సుబ్బారావు
పాలక వర్గం బుకాయింపులు
ఆలయానికి వచ్చే భక్తులు, దాతలు స్వామివారికి కిరీటాన్ని ఎందుకు అలంకరించడం లేదని నిలదీసినప్పుడల్లా పాలక వర్గ సభ్యులు రకరకాలుగా బుకాయించారు. కిరీటాన్ని భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకు లాకర్‌లో చాలా సురక్షితంగా ఉంచామని అబద్ధాలు చెబుతూ ఇన్నాళ్లూ కాలయాపన చేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఆ పవిత్రమైన బంగారు కిరీటాన్ని కేవలం రూ.38 లక్షల మొత్తానికి బ్యాంకులో తాకట్టు పెట్టేసినట్లు విచారణలో తేలింది. ఆలయానికి వచ్చే నిధులు, ఆభరణాల రక్షణపై కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, దాతల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ విధంగా దోపిడీకి పాల్పడటం స్థానికంగా పెద్ద దుమారం రేపింది.
సొంత వ్యాపారాలకు నిధులు
భక్తులు భగవంతుడికి సమర్పించిన కానుకలను, ఆభరణాలను అడ్డం పెట్టుకుని ఆలయ కమిటీ సభ్యులు అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నారని దాతలు ఆరోపించారు. తాకట్టు ద్వారా వచ్చిన రూ.38 లక్షల నగదును కమిటీ సభ్యులు తమ సొంత వ్యాపార అవసరాలకు పెట్టుబడిగా మళ్లించారని ఆధారాలతో సహా బయటపెట్టారు. దేవుడి సొమ్మును కాజేసి, వ్యాపారాలు చేస్తూ భక్తుల సెంటిమెంట్లతో ఆడుకుంటున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయాల పవిత్రతను దెబ్బతీస్తూ, దాతలను మోసం చేసిన పాలక వర్గ సభ్యులపై తక్షణమే దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తాకట్టులో ఉన్న స్వామివారి బంగారు కిరీటాన్ని వెంటనే రికవరీ చేసి, ఆలయానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘరానా మోసానికి కారణమైన కమిటీ సభ్యులందరినీ పదవుల నుంచి తొలగించి, వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దాత మాటూరు సుబ్బారావుతో పాటు స్థానిక భక్తులు పోలీస్ స్టేషన్ ఎదుట డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మన అంగన్వాడీ మన బాధ్యత

మన అంగన్వాడీ మన బాధ్యత కాక‌తీయ ప్ర‌తినిధి - ఏలూరు : మన...

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు ఏపీ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో...

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి ఆర్గనైజర్‌తో పాటు ముగ్గురు విటుల అరెస్ట్ ఇద్దరు మహిళలను...

వైభవంగా అషాడమాస సారె సమర్పణ

వైభవంగా అషాడమాస సారె సమర్పణ కాక‌తీయ, ఏలూరు ప్ర‌తినిధి : మండల కేంద్రంలోని...

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు వృద్ధాశ్రమం, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ శేఖర్, మధు సేవలను...

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా - కోట విలేకర్లతో ఎస్‌.ఐ వల్లి పద్మ కాక‌తీయ...

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం గ్రామీణ పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ తోడ్పాటు వీఏఓల పనితీరులో...

మార్కాపురంలో ఘెర‌ బస్సు ప్రమాదం… 14 మంది సజీవదహనం

మార్కాపురంలో ఘెర‌ బస్సు ప్రమాదం… 14 మంది సజీవదహనం హైదరాబాద్ నుంచి పామూరు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.