epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్రమార్కులు అప్ర‌మ‌త్తం

అక్రమార్కులు అప్ర‌మ‌త్తం
నిద్ర మైకంలో మైనింగ్ అధికారులు
మ‌ల్లంప‌ల్లి మ‌ట్టి దందాలో జాగ్ర‌త్త ప‌డుతున్న‌ దొంగ‌లు
కాక‌తీయ క‌థ‌నాల‌తో అక్ర‌మార్కులు అల‌ర్ట్
రాత్రికి రాత్రే టిప్పర్, జేసీబీ టైర్ల గుర్తులు చెరిపేసే ప్ర‌య‌త్నం
విజిలెన్స్ అధికారులు, కలెక్టర్ దృష్టిసారించేనా..?

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండల పరిధిలో మైనింగ్ మాఫియా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నా, అధికారులు మాత్రం కనీస కదలిక చూపకపోవడం స్థానికుల్లో ఆగ్రహం క‌లిగిస్తోంది. ప్రభుత్వ అనుమతులు ముగిసిన క్వారీలను మూసివేయాల్సింది పోయి, కొందరు రాజకీయ వ్యాపారవేత్తలు రాత్రింబగళ్లు భారీ యంత్రాలతో తవ్వకాలు కొనసాగిస్తూ కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మల్లంపల్లి, శ్రీనగర్, రామచంద్రాపురం, దేవనగర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న లాటరైట్, డోలమైట్ మైనింగ్ క్వారీలలో ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. లీజు గడువు ముగిసినా కూడా ఎస్కవేటర్‌ లతో ఎర్ర మట్టిని తవ్వి, టిప్పర్ లలో లోడ్ చేసి రాత్రివేళల్లో వేరుజిల్లాలకు తరలిస్తున్నారు. మూడు రోజులుగా కాకతీయ దినపత్రిక ఈ అంశంపై వరుస కథనాలు ప్రచురించగా, పై అధికారుల ఒత్తిడి మేరకు గనులు మరియు భూగర్భశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సరైన విచారణ చేయకుండానే “అక్రమ తవ్వకాలు ఏవీ లేవు” అంటూ వివరణ ఇవ్వడం గ‌మ‌నార్హం. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకాలు జరిగిన ప్రాంతాలను ఆధారాలతో స‌హా క‌థ‌నంలో పేర్కొంటూ శుక్ర‌వారంసాయంత్రం కాక‌తీయ వెబ్సైట్‌లో మ‌రోసారి ప్ర‌చురించింది. అక్కడ ఎక్స్‌క‌వేట‌ర్‌, టిప్పర్ గుర్తులు ఉన్నాయి అంటూ సాక్ష్యాలతో రుజువు చేయడానికి సిద్ధమని కాకతీయ పేర్కొంది. అయితే ఈ సమాచారం బహిర్గ‌త‌మైన వెంట‌నే శనివారం రాత్రి మట్టి మాఫియా మూసివేయాల్సిన క్వారీ నుంచి అక్రమంగా మట్టి తవ్విన ఎస్కవేటర్‌ను అక్కడి నుంచి తొలగించి, టిప్పర్‌ రవాణా గుర్తులను చెరిపేసేందుకు విఫ‌ల‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. పత్రికలో కథనం వెలువడిన వెంటనే అక్రమార్కులు మేల్కొని తవ్వకాలకు సంబంధించిన ఆనవాళ్లను దాచేందుకు ప్రయత్నిస్తుండగా, అధికారులు మాత్రం మౌనం వహించడం సర్వత్ర విమర్శలకు దారి తీస్తోంది.

అధికారుల నిర్లక్ష్యం…. ప్రజల్లో ఆగ్రహం….

ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతున్నప్పటికీ, సంబంధిత మైనింగ్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు అని, క్వారీల వద్ద తవ్వకాలు కొనసాగుతున్నాయా లేదా అన్న విషయంపై క్షేత్రస్థాయిలో తనిఖీలు జరపకపోవడం వారి బాధ్యతా రాహిత్యాన్ని బయటపెడుతోంది అని, అధికారుల కళ్ళముందే మట్టి దోపిడీ జరుగుతోంది అని, అధికారులు చూడనట్లు నటిస్తున్నారు అని, పైస్థాయి ఒత్తిళ్ల వల్ల చర్యలు తీసుకోవడంలేదు అని మండిపడ్డారు. మైనింగ్ అధికారుల పర్యవేక్షణ అనంతరం మట్టి మాఫియా టిప్పర్ గుర్తులను జరిపేయడం పట్ల అధికారుల అండదండల తో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు భావిస్తున్నారు.

విజిలెన్స్, కలెక్టర్ జోక్యం అవసరం…

మల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్‌, విజిలెన్స్ అధికారులు స్వయంగా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అనధికారిక మట్టి తవ్వకాలు జరిగాయా లేదా అన్న విషయంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తే, నిజా నిజాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. అలాగే విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తే, అక్రమ తవ్వకాలకు చెక్ పడుతుందని, మైనింగ్ మోసాల వెనుక ఉన్న పెద్దల పేర్లు బయటపడతాయని స్థానికులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.