epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారం జాతరకు సర్వం సిద్ధం

మేడారం జాతరకు సర్వం సిద్ధం
గిరిజన సంప్రదాయాలకు పెద్దపీట
3 కోట్ల మంది భక్తుల రాక అంచనా
సీఎం చేతుల మీదుగా వనదేవతల గద్దెల పునఃప్రారంభం
సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు

కాకతీయ, ములుగు ప్రతినిధి : గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకతను చాటిచెప్పే విధంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా వనదేవతల గద్దెల పునఃప్రారంభం చేయనున్నట్లు సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్. శ్రీనివాస రాజు తెలిపారు. గురువారం ఎస్‌.ఎస్‌. తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

జనవరి 28 నుంచి జాతర

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ, మేడారం జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవింద రాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్ద రాజును గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుందని చెప్పారు. 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెపైకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. 30వ తేదీన భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లిస్తారని, 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజు వనదేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుందని వివరించారు. మేడారం జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, జాతర పరిసరాలను 8 జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌లో 8 మంది అధికారులను నియమించినట్లు తెలిపారు. మొత్తం 42 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

రహదారులు–సిగ్నల్ ఏర్పాట్లు

భక్తులకు సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్యలు తలెత్తకుండా 60 శాశ్వత సెల్ టవర్లు ఏర్పాటు చేసి కాల్ డ్రాప్, వీక్ సిగ్నల్ సమస్యలను నివారించేలా ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. రహదారుల విషయానికి వస్తే, 39 పాత రహదారులు, 10 కొత్త రహదారుల్లో మొత్తం 525 సమస్యలను పరిష్కరించామని వెల్లడించారు. పార్కింగ్ కోసం అటవీ శాఖ పరిధిలో 235 ఎకరాలు, పట్టా భూములు 250 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3 ఎకరాలు గుర్తించి, వాటి నిర్వహణ బాధ్యతలను అటవీ, గిరిజన సంక్షేమ శాఖలకు అప్పగించినట్లు తెలిపారు. వీఐపీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు పసర–తాడ్వాయి మార్గం ద్వారా మేడారానికి చేరుకుంటాయని, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు కాటారం–కల్వపల్లి మార్గం, హైదరాబాద్–వరంగల్ నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు పసర మార్గం ద్వారా చేరుకుంటాయని ఎస్పీ వివరించారు.

శాఖల సమన్వయం అవసరం

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు మాట్లాడుతూ, రహదారులు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు పార్కింగ్‌కు సంబంధించిన సమాచారం సులభంగా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ అభివృద్ధి చేయాలని సూచించారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, ఈఈ వీరస్వామి, నేషనల్ హైవే, ఆర్&బీ, పీఆర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, డీపీఓ, ఎండోమెంట్, విద్యుత్, డీఎం అండ్ హెచ్‌ఓ, ఫైర్, ఎక్సైజ్, ఫిషరీస్, టూరిజం, డీడబ్ల్యూఓ, డీవీహెచ్‌ఓ, ఐటీడీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.