epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అన్నంలో పురుగులు.. ఇనుప తీగలు

అన్నంలో పురుగులు.. ఇనుప తీగలు
కేయూ మెస్‌లో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ నిర్ల‌క్ష్యం
విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటం
హాస్టల్ మెస్ నిర్వాహణపై తీవ్ర విమర్శలు
వీసీ చాంబర్‌ను ముట్టడించిన విద్యార్థినులు

కాకతీయ, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయంలోని గర్ల్స్ హాస్టల్ మెస్‌లో తీవ్ర భోజన భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులకు వడ్డించిన భోజనంలో పురుగులు, ఇనుప తీగలు బయటపడటంతో క్యాంపస్‌లో కలకలం రేగింది. విద్యార్థినుల ఆరోగ్యంతో యాజమాన్యం చెలగాటమాడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నం, కూరలో పొడవాటి పురుగులు, నలుపు రంగు ఇనుప తీగలు స్పష్టంగా కనిపించాయని విద్యార్థినులు తెలిపారు. తినే సమయంలోనే ఈ వస్తువులు గుర్తించడంతో పలువురు భోజనం వదిలేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్‌లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటపడింది.

ఎప్పటి నుంచో నాసిరకం భోజనం

ఇది మొదటిసారి కాదని, గత కొంతకాలంగా గర్ల్స్ హాస్టల్ మెస్‌లో నాణ్యతలేని ఆహారం, పాత కూరగాయలు, సరైన వంట విధానం లేకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు మెస్ సిబ్బందికి, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. వంటశాల, పాత్రలు, నిల్వ గదుల్లో పరిశుభ్రత లోపించిందని, ఆహార భద్రతపై నిరంతర తనిఖీలు జరగడం లేదని పేర్కొన్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని అభిప్రాయపడ్డారు. ఇక హాస్టల్ పరిసరాల్లో వీధి కుక్కలు నిర్బంధం లేకుండా తిరగడం, మెస్ ప్రాంతంలోకి కూడా చేరడం ఆందోళన కలిగిస్తోందని విద్యార్థినులు తెలిపారు. ఆహార ప్రాంతాల్లో జంతువుల సంచారం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు పెద్ద ఎత్తున వీసీ చాంబర్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. గర్ల్స్ హాస్టల్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. యాజమాన్యం స్పందించే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

వారం రోజుల్లో పరిష్కారం హామీ

విద్యార్థినుల నిరసన తీవ్రత పెరగడంతో యూనివర్సిటీ అధికారులు స్పందించారు. వీసీ ఆదేశాల మేరకు విద్యార్థినులతో సమావేశం ఏర్పాటు చేసి, వారం రోజుల్లో గర్ల్స్ హాస్టల్‌కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మెస్ నిర్వహణపై సమీక్ష, పరిశుభ్రత మెరుగుదల, భోజన నాణ్యత పెంపు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదని, ఈసారి కూడా మాటలకే పరిమితం చేసే అవకాశం ఉందని విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు శాశ్వతంగా పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. గర్ల్స్ హాస్టల్‌లో కనీస సదుపాయాలు, నాణ్యమైన భోజనం, భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని స్పష్టం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.