epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఐటీడీఏలో నిర్లక్ష్యం

ఐటీడీఏలో నిర్లక్ష్యం
పరిపాలనను బ్రష్టు పట్టిస్తున్న అధికారిని వెంటనే బదిలీ చేయాలి
ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి పనిచేసే అధికారులే కావాలి
బడ్జెట్ లేక ఐటీడీఏలు రెక్కలు విరిగిన పక్షిలా మారింది
క్షేత్ర పర్యటనలు చేయకుండా అధికారులు గెస్ట్ హౌస్‌కే పరిమితం
సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలు అమలు కావడంలేదు
నిర్లక్ష్యంతో గిరిజనుల అభివృద్ధి వెనుకబడుతోంది
తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు తాటి నీలాద్రి

కాకతీయ, ఏటూరునాగారం : ఐటీడీఏలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్న ఆరోపణలతో ఆదివాసీలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో తుడుం దెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు అధికారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు తాటి నీలాద్రి మాట్లాడుతూ, ఐటీడీఏ పరిపాలనను బ్రష్టు పట్టిస్తున్న ప్రాజెక్టు అధికారిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదిమ తెగల అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, జీవోలు అమలులో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఐటీడీఏలు తమ ప్రాధాన్యతను కోల్పోయి బడ్జెట్ కేటాయింపులు లేక రెక్కలు విరిగిన పక్షిలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఐటీడీఏలు 29 శాఖల సమన్వయంతో సమర్థవంతంగా పనిచేసేవని, ఇప్పుడు మాత్రం నిర్లక్ష్యంతో ఆదివాసీల సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు.

క్షేత్రస్థాయిలో కనిపించని అధికారులు

ప్రాజెక్టు అధికారి సమయానికి కార్యాలయానికి రాకపోవడం, సిబ్బంది కూడా సమయపాలన పాటించకపోవడం వల్ల పరిపాలన పూర్తిగా దెబ్బతింటోందని మండిపడ్డారు. అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండకుండా పట్టణాల నుండి రాకపోకలు సాగించడం గిరిజనుల సమస్యల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని చూపిస్తోందన్నారు. ప్రాజెక్టు అధికారి కార్యాలయానికి రావడం కంటే గెస్ట్ హౌస్‌కే పరిమితమవుతున్నారని తీవ్రంగా విమర్శించారు. సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ జీవో ప్రకారం ప్రాజెక్టు అధికారి నెలలో కనీసం 15 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఐదు రోజులు గ్రామాల్లో బస చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ నిబంధనలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం వల్ల గిరిజనుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి చేరడం లేదని తెలిపారు.

ఐటీడీఏ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలి

ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీడీఏల పనితీరు తీవ్రంగా దెబ్బతిన్నదని, గిరిజనుల అభివృద్ధి అనేక సంవత్సరాలు వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆదివాసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రాజెక్టు అధికారిని వెంటనే బదిలీ చేసి, సమర్థవంతమైన అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐటీడీఏలను బలోపేతం చేసి, గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు కోరం సుధాకర్, ప్రధాన కార్యదర్శి ఈసం పణికుమార్, పిట్టల నాగేశ్వరావు, చాట్ల విజయ్, బొగ్గం శివకుమార్, చింత లక్ష్మణ్ స్వామి, పలక నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.