epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నాడు ప్రారంభించారు.. నేడు వదిలిపెట్టారు

నాడు ప్రారంభించారు.. నేడు వదిలిపెట్టారు
ఆరోగ్య ఉప కేంద్రానికి నిధులు వచ్చేనా
సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కానీ భవన నిర్మాణం
ఎప్పుడు ఏ బిల్డింగ్‌లో ఉంటుందో తెలియక రోగుల సతమతం
సొంత జీతాల్లో నుంచే ఆరోగ్య ఉపకేంద్రానికి రెంట్లు కట్టిన వైద్యులు
పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులపై గ్రామస్తుల ఆగ్రహం
కాకతీయ, ఆత్మకూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనా కార్యక్రమాల్లో అన్ని శాఖల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని గ్రామ ప్రజలు బహిరంగంగా చర్చిస్తున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రానికి నిత్యం గర్భిణీలు, వృద్ధులు, బాలింతలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే, ఈ కేంద్రం ఎప్పుడు ఎక్కడ కిరాయి ఇంట్లో మారుతుందో తెలియక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంలో ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీతాల్లో నుంచే కిరాయిలు
ఆరోగ్య ఉపకేంద్రానికి సరైన ప్రభుత్వ బిల్డింగ్ లేకపోవడంతో తరచూ ఇళ్లను మార్చాల్సి వస్తోందని, గతంలో దీని రెంట్‌ను సిబ్బంది తమకు వచ్చే జీతాల్లో నుంచే కట్టేవాళ్లమని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం రెంట్ లేకుండా తాత్కాలికంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాల క్రితం మండల కేంద్రంలోని పోచమ్మ సెంటర్ వద్ద నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదని, ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని స్థానిక సిబ్బంది పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ఈ భవనాన్ని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ప్రజలు మండిపడుతున్నారు.
నిధులు కేటాయించేనా
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ఆరోగ్య ఉపకేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమైందని మండల కేంద్రంలో జోరుగా చర్చ జరుగుతోంది. గుత్తేదారునికి చేసిన పనుల తాలూకు బిల్లులు చెల్లించకపోవడంతోనే అతను పనులను మధ్యలోనే నిలిపివేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎప్పటికైనా ప్రజా ప్రభుత్వం స్పందించి ఆత్మకూరు మండల కేంద్రంలోని ఉపకేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించి, బడ్జెట్ విడుదల చేసి పూర్తి స్థాయిలో భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు.
ఉత్సవాలకే పరిమితం
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఉత్సవాలకే పరిమితం అయిందని, ప్రజల కనీస సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైందని గ్రామస్తులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. గత 4 సంవత్సరాల నుండి ఆత్మకూరు మండల కేంద్రంలో ఆరోగ్య ఉపకేంద్రానికి సొంత భవనం లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నా.. జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఈ సమస్య కనబడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మధ్యలో ఆగిపోయిన భవన పనులను తక్షణమే ప్రారంభించాలని ఆత్మకూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.