epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అడగొద్దు మెనూ .. పెట్టింది తిను..

అడగొద్దు మెనూ .. పెట్టింది తిను..
ప్రభుత్వం నిర్దేశించిన మెనూకు తూట్లు
సాంబార్‌ స్థానంలో చింతపండు చారు.. ఆకుకూర పప్పుకు పంగనామం
డయాలసిస్‌ రోగులు, బాలింతలకు భోజనం అందించడంలోనూ నిర్లక్ష్యం
ప్రశ్నిస్తే దురుసు సమాధానాలు
నాణ్యత ప్రమాణాలపై కరవైన పట్టింపు
గుత్తేదారు తీరుపై ఆరోపణలు
చర్యలు చేపట్టాలంటున్న రోగులు

కాకతీయ, ఏటూరునాగారం : రోగులకు వైద్యం ఎంత ముఖ్యమో.. చికిత్స సమయంలో సమయానికి నాణ్యమైన పౌష్టికాహారం అందించడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా డయాలసిస్‌ రోగులు, బాలింతలకు ఆహారంలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావులేదు. రోగుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించాల్సిన ఆహారానికి ప్రభుత్వం సమయాలు, పరిమాణాలతో సహా స్పష్టమైన మెనూను నిర్దేశించింది. ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య 150 గ్రాముల ఇడ్లీ–3, సాంబార్‌/చట్నీ 100 మి.లీ., పొంగల్‌/కిచిడీ/ఉప్మా 300 గ్రాములు, మినపప్పు–చట్నీ/బ్రెడ్‌ 100 గ్రాములు, పాలు 150 మి.లీ., గుడ్డు ఒకటి ఇవ్వాలి. మధ్యాహ్నం 12 నుంచి 1 గంటలోపు 450 గ్రాముల అన్నం/6 అంగుళాల పుల్కా, కూరగాయల కూర 50 గ్రాములు, ఆకుకూరల పప్పు 100 గ్రాములు, సాంబార్‌ 150 మి.లీ., గుడ్డు, పెరుగు/మజ్జిగ 100 మి.లీ., అరటిపండుతో పాటు సాయంత్రం చిక్కీ 50 గ్రాములు/ఉడికించిన పల్లి 20 గ్రాములు అందించాలి. రాత్రి 6 నుంచి 8 గంటల మధ్య 450 గ్రాముల అన్నం/పుల్కా, కూరగాయల కుర్మా 100 గ్రాములు, సాంబార్‌ 150 మి.లీ., ఆకుకూరల పప్పు 50 గ్రాములు, గుడ్డు, పెరుగు/మజ్జిగ 100 మి.లీ. ఇవ్వాల్సి ఉంది. అయితే ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నిబంధనలు అమలు కావడం లేదని పలువురు రోగులు, బంధువుల నుంచి ‘కాకతీయ’కు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని నిర్ధారించుకునేందుకు ఆసుపత్రిలో పరిశీలించగా.. మెనూ బోర్డుపై ఉన్న నిబంధనలకు, రోగుల ప్లేట్లలో వడ్డిస్తున్న భోజనానికి పొంతనే లేకపోవడం స్పష్టమైంది.

సాంబార్‌ స్థానంలో చింతపండు చారు.. పప్పుకు పంగనామం

ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్నం, రాత్రి భోజనంలో సాంబార్‌, ఆకుకూరల పప్పు, కూరగాయల కూర/కుర్మా, గుడ్డు, పెరుగు లేదా మజ్జిగ ఉండాలి. కానీ ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో సాంబార్‌కు బదులుగా చింతపండు చారు వడ్డిస్తున్నారు. ఆకుకూరల పప్పు అందించడం లేదు. పెరుగు లేదా మజ్జిగ కూడా క్రమం తప్పకుండా ఇవ్వడం లేదు. మెనూలో పేర్కొన్న పౌష్టిక పదార్థాలను పక్కనపెట్టి అన్నం, చారు, ఒక కూరతోనే భోజనం ముగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రోగులు త్వరగా కోలుకునేందుకు అవసరమైన పోషకాలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్దేశించిన మెనూకే కోతలు పడుతుండటంపై రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాల్సిన చోట నామమాత్రపు భోజనంతో సరిపెట్టడం.. రోగుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన విధానాన్ని నీరుగారుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మెనూ ప్రకారం అందకుండా ఉన్న భోజనం

భోజనం పంపిణీలోనూ నిర్లక్ష్యం

ఈ పరిస్థితికి తోడు డయాలసిస్‌ రోగులు, బాలింతలకు వారి బెడ్‌ వద్దకే భోజనం అందించాల్సి ఉండగా.. ఈ విధానం సక్రమంగా అమలు కావడం లేదని రోగుల బంధువులు చెబుతున్నారు. రోగి తరఫున ఎవరైనా వచ్చి ఆహారం తీసుకెళ్తే అందిస్తున్నారని.. ఎవరూ రాకపోతే వారికి భోజనం అందని పరిస్థితి ఉంటోందని ఆరోపిస్తున్నారు. స్వయంగా లేచి వెళ్లలేని రోగుల వద్దకు సిబ్బందే భోజనం తీసుకెళ్లాల్సి ఉన్నా.. బంధువు వస్తేనే ఆహారం చేరే పరిస్థితి నెలకొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోగికి అందాల్సిన భోజనం కోసం కూడా బంధువులే పరుగులు తీయాల్సి వస్తుండటంతో.. ఆసుపత్రి సేవల పర్యవేక్షణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రోగి కోసం చేతి సంచిలో భోజనం తీసుకెళుతున్న రోగి బంధువులు

తింటే తినండి.. లేకపోతే మీ ఇష్టం

మెనూ ప్రకారం భోజనం ఎందుకు అందించడం లేదని ప్రశ్నించిన రోగులు, వారి బంధువులకు నిర్వాహకుల నుంచి దురుసు సమాధానాలు ఎదురవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. “ఇక్కడ ఇలాగే ఉంటుంది.. తినండి.. లేకపోతే మీ ఇష్టం” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని పలువురు వాపోతున్నారు. భోజన నాణ్యత, నిర్ణీత పరిమాణాలు, సమయపాలనపై ప్రశ్నించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను పక్కనపెట్టి, నాణ్యతలోనూ కోతలు పెడుతూ గుత్తేదారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు.. రోగుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యానికే తూట్లు పొడుస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే తనిఖీ నిర్వహించి వాస్తవాలను నిగ్గుతేల్చడంతోపాటు, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.