మచ్చ కుమారస్వామి ఇకలేరు
రోడ్డు ప్రమాదంలో అకాల మృతి
కుటుంబానికి సంఘాల ఆర్థిక సాయం
భారీగా తరలివచ్చిన బంధువులు, నాయకులు
కాకతీయ, వరంగల్ : నగరంలోని రంగసాయిపేటకు చెందిన శ్రీరామ ట్రాలీ యూనియన్ అధ్యక్షుడు మచ్చ కుమారస్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సందర్శించిన వివిధ పరపతి సంఘాల ప్రతినిధులు, ట్రాలీ యూనియన్ నాయకులు, కుల సంఘాల పెద్దలు, మాజీ కార్పొరేటర్ గుండు చందన–పూర్ణచందర్, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. మిత్ర పరపతి సంఘం, జనతా పరపతి సంఘం ప్రతినిధులు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. అనంతరం లెనిన్నగర్లోని నివాసం నుంచి అంతిమయాత్ర రంగసాయిపేట గౌచర్ల జంక్షన్, మహంకాళి, బొడ్రాయి సెంటర్, రజక, యాదవ్నగర్ మీదుగా కొనసాగింది. బైపాస్ రోడ్డు సమీపంలోని రజక స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.


