epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...
  • అవసరం లేని పురుగుమందుల‌ను అంటగడుతున్న వైనం
  • మోతాదు పెంచి అమ్ముతూ లాభాలు గ‌డిస్తున్న‌ వ్యాపారులు
  • పంట న‌ష్టంతో బెంబేలెత్తుతున్న రైతులు
  • న్యాయం చేయాలంటూ వేడుకోలు

కాకతీయ, నర్సింహులపేట : ఆరుగాలం కష్టపడే రైతన్నకు అడుగ‌డుగునా అవరోధాలే ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు అకాల వర్షాలతో సతమతమైన రైతులకు ఒకవైపు యూరియా సంక్షోభం త‌లెత్తింది. వేకువ జామున లేచింది మొదలు రాత్రి వరకు యూరియా కోసం జాగారం చేయ‌డం తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ప్ర‌తీ స‌మ‌స్య‌ను ఎలాగోలా నెట్టుకొస్తున్న అన్న‌దాత‌కు క్రిమి సంహార‌క‌ ర‌సాయానుల విక్ర‌య‌దారుల నుంచి కొత్త‌ర‌కం స‌మ‌స్య వ‌స్తోంది. త‌మ పంట చేతికందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నత‌రుణంలో ఫెస్టిసైడ్ వ్యాపారులు అంట‌గ‌డుతున్న మందుల‌తో పంట మొత్తం న‌ష్ట‌పోయే ప‌రిస్థితి దాపురించింది. పెట్టుబడులు పోనూ ఈ ఏడాది అయినా పంట‌ కలిసి వస్తుందేమోనని ఎదురుచూస్తున్నఅన్నదాతలకు నిరాశే మిగులుతోంది. అన్న‌దాత‌కు అవసరంలేని పురుగు మందులను అంటగడుతూ దుకాణా దారులు రైతులను నట్టేట ముంచుతున్నారు.

తాజాగా ఈ కోవ‌లోనే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని మన గ్రోమోర్ సెంటర్ నిర్వాహకుల తీరు విస్మయానికి గురిచేస్తోంది. స‌ద‌రు సెంటర్ నిర్వాహకులు అమాయక ప్రజలే టార్గెట్ చేసుకుని మూడు పూవులు ఆరు కాయ‌లుగా వ్యాపారం సాగిస్తున్నారు. పంట‌కు అవసరంలేని మందులను అంటగట్టడంలో వీరు సిద్ధ‌హ‌స్తుల‌ని ప‌లువురు రైత‌న్న‌లు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సిఫారసు చేసిన మోతాదును మించి డోస్ పెంచి అమ్ముతూ లాభాలు గ‌డిస్తున్నారు. నర్సింహులపేట మండలంలోని బోజ్జన్నపేట గ్రామానికి చెందిన జాగాటి రామ్మూర్తి తనకున్న రెండు ఎకరాల భూమిలో వరి పంట సాగు చేశాడు. వరి పంటకు రోగం తగలడంతో మన గ్రోమోర్ సెంటర్ కు వెళ్లాడు. వరిలో పురుగు చనిపోవుట గాను 20 పంపులకు ప్రోపనోపాస్, ట్రైసైక్లో జోల్ కాంబినేషన్లో మందులను రైతుకు సెంటర్ వారు ఇచ్చారు. ఈనెల ఏడో తేదీన రైతు 20 పంపులు పిచికారి చేశాన‌ని తెలిపారు.

ఈ క్ర‌మంలో పొలానికి వెళ్లి చూడగా పొలం మొత్తం ఎరుపు రంగులోనికి మారడంతో స‌ద‌రు రైతు బిక్క మొహంతో ఆందోళ‌న చెందిన‌ట్లు తెలిపారు. చుట్టుపక్క రైతులను సంప్రదించగా పురుగుమందు డోసు పెరగడంతో పొలం ఎండిపోయినట్లుగా నిర్ధారించారు. తనకు అధిక మోతాదు పురుగుమందును అంటగట్టిన వ్యాపారుల‌పై వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయవలసిందిగా బాధిత రైతు కోరుతున్నాడు. ఈ విష‌య‌మై మండల వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్ ను వివ‌ర‌ణ కోర‌గా ప్రోపోనోపాస్ 50 ఈసీ పురుగుమందును 2 ఎంఎల్‌ మందును ఒక లీటర్ నీటితో కలిపి పిచికారి చేయాలని తెలిపారు. 20 పంపులకు గాను 400 ఎంఎల్ మందును మాత్రమే పిచికారి చేయాలని, ఎక్కువ డోసు పిచికారి చేయడం ద్వారానే పొలం ఎర్రబారి పోయినట్లు తెలిపారు. మోతాదు మించి ఎక్కువ ఎక్కువ డోస్ తో విక్రయాలు జరిపినటువంటి మన గ్రోమోర్ సెంటర్ పై చర్యలు తీసుకోనున్నట్లు ఏవో స్ప‌ష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.