epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పరకాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం

పరకాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

కాకతీయ, పరకాల/గీసుగొండ :

పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి నియోజకవర్గంలోని పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు, గీసుగొండ, సంగెం మండలాలలో పర్యటన చేసి పలు గ్రామాలలో అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు, భూమిపూజలు చేశారు. గీసుగొండ మండలంలోని గట్టుకిందిపల్లిలో అంగన్వాడి కేంద్రాకి ఎమ్మెల్యే రేవూరి, జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రామాణిక అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రాథమిక అవసరాలైన రోడ్లు తాగునీరు డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్తు వంటి రంగాలలో వేగవంతమైన అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైంది అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. గీసుకొండ మండలం మరియాపురం గ్రామంలోని పత్తి వ్యవసాయ క్షేత్రంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా నానో యూరియాను పిచికారీ చేసిన విధానాన్ని ఎమ్మెల్యే రేవూరి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కష్టాన్ని తగ్గించుకోవాలని సూచించారు. డ్రోన్ల ద్వారా క్రిమిసంహారకాలను పిచికారి చేసుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేసుకోవచ్చని డ్రోన్ల ద్వారా పిచికారి చేయడం వలన పంట అంతటికి ఒకే విధంగా మందు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో జడ్పీ సీఈఓ రామిరెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ ఇజ్జగిరి, డిఈ జ్ఞానేశ్వర్ ఆయా మండలాల తహసిల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఏఈలు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పాలనతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ కు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా గ్రామాలు, పట్టణాల్లో సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైకిల్ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ యూనిట్ ఎంతో ఉపయోగకరమని అన్నారు. గ్రామా ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని గ్రామా ప్రజలకు సూచించారు. అనంతరం చౌళ్లపల్లి, అగ్రంపహాడ్ గ్రామాల్లో నూతన అంగన్వాడీ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, బిఆర్ఎస్ హయాంలో గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఆరు గ్యారంటీల హామీలను నెరవేరుస్తున్నామని ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ పై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఎమ్మెల్యే రేవూరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల ప్రత్యేక అధికారి నిర్మల, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటి తహసీల్దార్ భాస్కరమూర్తి, ఎంపిఓ విమల, ఏఈ బాబురావు, ఎపిఓ రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కమలాపురం రమేష్, ఆత్మకూరు మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు, ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ బీరం సుధాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, మాజీ జడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు, పిఏసియస్ వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి, తదితరులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.