epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆనంద్‌పై ఆరా!

ఆనంద్‌పై ఆరా!
సీ-సెక్షన్‌లో ఏడేళ్లుగా విధులు
ప్ర‌జావాని నుంచి సీడీఎంఏకు లేఖ..
ప్రజావాణిలో ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
బల్దియా అధికారుల‌ను వివ‌ర‌ణ కోరిన సీడీఎంఏ
సీ-సెక్షన్ ఉద్యోగికి మెమో జారీ

కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సీ-సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆనంద్ వ్యవహారం ప్రస్తుతం బల్దియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌లో చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు, ఉద్యోగుల బదిలీల్లో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా పాలకవర్గంలో ఓ బడా నేత అండతో ఆనంద్ తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సీ-సెక్షన్‌లో సూపరింటెండెంట్‌గా ఏడేళ్లుగా పనిచేస్తున్నాడన్న అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. అదే సమయంలో సీ-1 సెక్షన్‌కు కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.

ఒకే సెక్షన్‌లోనే ఏళ్ల తరబడి!

ఒకే సెక్షన్‌లో సుదీర్ఘకాలం పనిచేయడంతో ఉన్నతాధికారులు, పాలకవర్గంలో పలుకుబడి పెంచుకుని ‘తాను చెప్పిందే వేదం’ అన్నట్లు వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతర్గత బదిలీల్లో సైతం అర్హత లేని వారిని ఆర్‌ఐలుగా నియమించడంలో చక్రం తిప్పినట్లు బల్దియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాలపరిమితి ముగిసిన ఉద్యోగులను పక్కన పెట్టి, తనకు అనుకూలంగా ఉండేవారికే బదిలీలు కల్పించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పలువురు సీనియర్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే చోట మూడేళ్లకు మించి పని చేయరాదన్న నిబంధన ఉన్నప్పటికీ, ఆనంద్ ఏడేళ్లుగా అదే సెక్షన్‌లో కొనసాగుతున్నాడంటూ కొందరు ఉద్యోగులు ఇటీవల ప్రజాభవన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు ప్రజావాణి నుంచి సీడీఎంఏకు లేఖ వెళ్లగా, ఆనంద్ వ్యవహారంపై వివరణ కోరుతూ జీడబ్ల్యూఎంసీకి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.

ఆనంద్‌కు మెమో జారీ

దీంతో బల్దియా ఉన్నతాధికారులు ఆనంద్‌కు మెమో జారీ చేశారు. ప్రస్తుతం ఆనంద్ వివరణ తయారీలో నిమగ్నమైనట్లు, ఆ వివరణను మరో ఉద్యోగితో సిద్ధం చేయిస్తున్నట్లు కార్యాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, తాను సీ-సెక్షన్‌లో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలే పని చేశానని, ఏడేళ్లు అవాస్తవమని తన వివరణలో పేర్కొంటున్నట్లు సమాచారం. అయితే, మూడేళ్లకే బదిలీ చేయాల్సిందే కదా అన్న ప్రశ్న బల్దియాలో మళ్లీ తెరపైకి వచ్చింది. ఆనంద్‌పై వస్తున్న మరో ప్రధాన ఆరోపణ ఏమిటంటే… తన బావమరిది బదిలీని అడ్డుకోవడంలో శాయశక్తులా ప్రయత్నించడమే. పరకాల మున్సిపాలిటీ నుంచి వరంగల్‌కు డిప్యుటేషన్‌పై వచ్చిన 31 మంది పీహెచ్ వర్కర్లను తిరిగి పంపించాలని ఎమ్మెల్యే ఆదేశాల నేపథ్యంలో కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో 30 మంది తిరిగి వెళ్లినా, ఒకరు మాత్రం ఇప్పటికీ వరంగల్‌లోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఒక్కరు ఆనంద్ బావమరిది కావడం, అతని డిప్యుటేషన్ కొనసాగేందుకు ఆనంద్ పెద్దఎత్తున లాబీయింగ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అమలు కాకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
బల్దియాలో ఎంతోమంది సూపరింటెండెంట్లు, అధికారులు ఉన్నా ఆనంద్‌కే ప్రత్యేక ప్రాధాన్యం ఎందుకని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ఆనంద్ వ్యవహారంపై కమిషనర్ చర్యలు తీసుకుంటారా? లేక రాజకీయ అండతో వ్యవహారం అలాగే కొనసాగుతుందా? అన్నది వేచిచూడాల్సిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.