epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విన్నపాలు విడిచి

విన్నపాలు విడిచి
పన్నుల వేట!

వెలవెలబోయిన జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ ..
పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు
ఆఫీస‌ర్ల తీరుపై బాధితుల ఆగ్ర‌హం

కాకతీయ, వరంగల్: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నిర్వహిస్తున్నామంటున్న గ్రీవెన్స్ సెల్ సోమవారం వరంగల్ మహానగర పాలక సంస్థలో వెలవెలబోయింది. తమ గోడు వెళ్లబోసుకునేందుకు ప్రజలు తరలివచ్చినా.. అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకాకపోవడంతో నిరాశకు లోనయ్యారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్ తోపాటు మరో అధికారీ మాత్రమే గ్రీవెన్స్ సెల్ కు హాజరయ్యారు. అయితే, మార్చి నెల.. ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో చాలామంది అధికారులు పన్నుల వేటలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రీవెన్స్ సెల్స్ ను విస్మరించి.. పన్నుల వసూళ్లకే ప్రాధాన్యం ఇవ్వడం పట్ల గ్రీవెన్స్ సందర్శకుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల సమస్యలను గాలికొదిలేసి.. పన్నుల కోసం అధికారులు గైర్హాజర్ కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇక గ్రీవెన్స్‌కు మొత్తం 53 అర్జీలు రాగా, టౌన్లానింగ్ విభాగానికి 21, ఇంజనీరింగ్ 16, రెవెన్యూ 4, హెల్త్ అండ్ శానిటేషన్ 7, నీటి సరఫరా 4, హార్టికల్చర్ విభాగానికి 1 వినతులు అందాయి. కార్యక్రమంలో ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, తదితరులు పాల్గొన్నారు.

వినతుల వివరాలిలా..

ఉర్సు కుమ్మరివాడ శివారులో శ్మశానవాటికకు వెళ్లే సీసీ రోడ్డును కొందరు జేసీబీతో ధ్వంసం చేసినట్లు స్థానికులు గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

27వ డివిజన్ దళితకాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు అర్ధంతరంగా రద్దు కావడాన్ని ఆక్షేపిస్తూ స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్కుమార్ బల్దియా గ్రీవెన్స్ ను ఆశ్రయించారు. పనులపై అగ్రిమెంట్ జరిగాక, రద్దు కావడం ఏమిటని ప్రశ్నించారు. అందుకు గల కారణాలు, కారకులు ఎవరనే విషయంపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

భూ కబ్జా, అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి

దేశాయిపేట ఏరియా సర్వేనంబర్ 299లో గల తన 20 గుంటల పట్టా భూమిని కొందరు ఆక్రమించి, అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని జన్ను నూతన్ బల్దియా అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ విషయమై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి, తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

సొసైటీ స్థలం కబ్జా

కాశీబుగ్గ ఏరియాలోని బ్రిక్స్ అండ్ టైల్స్ కో ఆపరేషన్ సొసైటీ స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా నిర్మాణాలు చేపడుతున్నారని సొసైటీ బాధ్యులు డాక్టర్ సముద్రాల లక్ష్మీనారాయణ విన్నవించారు. గతంలో కొందరు కబ్జా చేస్తుంటే కోర్టుకెళ్లగా, ఆ స్థలం సొసైటీదేననే న్యాయస్థానం తేల్చిందని, అయినా, వెలిశాల మల్లికాంబ పేరిట కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని మళ్లీ ఆక్రమించుకుంటున్నారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి సొసైటీ స్థలాన్ని పరిరక్షించాలని గ్రీవెన్సెసెల్లో వినతిపత్రం సమర్పించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.