epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ
పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందుబాటులో
యువతలో అవగాహన పెంపుపై దృష్టి సారించాలి
గర్భిణీలకు ప్రత్యేక పరీక్షలు, నివారణ చర్యలు
కలెక్టర్ డాక్టర్ సత్యశారద

కాకతీయ, వరంగల్ : ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరికి సమగ్ర అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో నాలుగో రోజు ఎయిడ్స్ అవగాహన, నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాకతీయ మెడికల్ కళాశాల (కెఎంసి) నుండి ఎంజీఎం ఆసుపత్రి కూడలి వరకు నిర్వహించిన రెడ్ రన్ వాకథాన్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, ఆశాలు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని “ఎయిడ్స్ నివారణ” నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీ అనంతరం ఎంజీఎం కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిడ్స్‌పై సరైన అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్త మార్పిడి, కలుషిత సూదులు, సిరంజీల వినియోగం ద్వారా వ్యాధి వ్యాపించే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సురక్షిత పద్ధతులను అనుసరించడం, అవసరమైన సందర్భాల్లో హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు, చికిత్స, కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, బాధితులు ఎలాంటి భయం లేకుండా వాటిని వినియోగించుకోవాలని సూచించారు.

పరీక్షలు–చికిత్సలు అందుబాటులో

వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, ఎంజీఎం, సీకేఎం ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ఎయిడ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా ఉచితంగా ఎయిడ్స్ పరీక్షలు నిర్వహిస్తూ, తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా నివారణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎయిడ్స్ నిర్ధారణ అయిన వెంటనే ఏఆర్టీ కేంద్రాల ద్వారా ఉచిత చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకుండా మానవతా దృక్పథంతో సహకరించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలలు, గ్రామ, పట్టణ స్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో, పట్టణాల్లో ఎయిడ్స్ నివారణపై కళాజాతలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు వీటిలో పాల్గొని సరైన సమాచారం తెలుసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు కోరారు. ఈ సందర్భంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్మికుల కోసం నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్‌ను కలెక్టర్ ప్రారంభించి వైద్య పరీక్షలను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వైద్య గణేష్, సంధ్యారాణి, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, జిల్లా అధికారులు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశాలు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎన్జీఓలు, ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.