తెలంగాణను ముందంజలో నిలిపిన కేసీఆర్
పార్టీ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ ఎస్ నేతలు
పెద్దవంగరలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
కాకతీయ, పెద్దవంగర: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్దవంగర మండల వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమ నేత కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని గుర్తుచేశారు. “ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల నెరవేరింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపాం. ఉద్యమం నుంచి పుట్టిన ఈ పార్టీకి ప్రజలే అసలైన బలం, భవిష్యత్తు” అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తరలివచ్చిన శ్రేణులు..
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్, ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న, నాయకులు శ్రీరాం సుధీర్, సర్పంచులు వెంకన్న, పర్శరాములు, కవిత, ప్రదీప్, జ్ఞానేశ్వర చారి, చింతల భాస్కర్, సుధాకర్, వెంకటరామయ్య, అశోక్, అనిల్, యాకన్న, అనుదీప్ పాల్గొన్నారు. అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు నిమ్మల విజయశ్రీనివాస్, సితారాం నాయక్, షరీబుద్దీన్, సోమిరెడ్డి, గద్దల వెంకన్న, రాజు, యాకభిక్షం తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

