జూన్ 17న మెగా జాబ్ మేళా
ఇంచెర్ల ఎం.ఆర్. గార్డెన్స్లో నిర్వహణ
70కి పైగా ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం
ఏడో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత గల అభ్యర్థులకు అవకాశం
ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జూన్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పి కేకాన్ సుధీర్ రామనాథ్ తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఇంచెర్ల గ్రామంలోని ఎం.ఆర్. గార్డెన్స్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ జాబ్ మేళాకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో 70కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని వేలాది ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. ఇంజినీరింగ్, టెక్నికల్, ఫార్మసీ, స్కిల్డ్ వర్క్ మరియు సర్వీస్ వంటి వివిధ రంగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్ వంటి నగరాలతో పాటు ప్రాంతీయ జిల్లాల్లోనూ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అర్హతలు మరియు కావలసిన పత్రాలు
7వ తరగతి నుంచి ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ ఈ మేళాకు హాజరుకావచ్చు. అభ్యర్థులు తమ వెంట తాజా బయోడేటా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, విద్యార్హత ధ్రువపత్రాలు మరియు ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. గ్రామీణ యువత తమ ప్రతిభను చాటుకుని స్థిరపడేందుకు ఇది అద్భుతమైన అవకాశం అని జిల్లా పరిపాలన పేర్కొంది. అర్హులైన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. మరిన్ని వివరాల కోసం డీఎస్పీని (8712670103) లేదా సీఐని (8712670111) సంప్రదించవచ్చని తెలిపారు.

