జీడబ్ల్యూఎంసీ కొత్త కమిషనర్గా టి. వెంకన్న
అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కు విముక్తి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్గా టి. వెంకన్నను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏలో కోర్ అర్బన్ రీజియన్ అండ్ మెట్రో రైల్ విభాగం జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా పనిచేస్తున్న ఆయనను జీడబ్ల్యూఎంసీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటివరకు జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. నూతన కమిషనర్ టి. వెంకన్న త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

