ఎంపీడీవో కృష్ణవేణికి బీఆర్ఎస్ నేతల వినతి
ప్రభుత్వ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్
కాకతీయ, గీసుగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో కృష్ణవేణికి వినతిపత్రం అందజేశారు. మహిళలు, రైతులు, యువత, పేదలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి హామీల అమలుకు చర్యలు చేపట్టాలని ఎంపీడీవోను కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, బీఆర్ఎస్ నాయకులు చల్లా వేణుగోపాల్రెడ్డి, ఫోన్లు జయపాల్రెడ్డి, రఘుపతిరెడ్డి, గుర్రం రఘు, ముంత రాజయ్య, బోడకుంట్ల ప్రకాష్, నమిండ్ల రాజు, శ్రీను, ధనుంజయ్, నరేష్, చిరంజీవి, యూత్ అధ్యక్షుడు శిరీషే శ్రీకాంత్, కోట ప్రమోద్, లెనిన్ అభిషేక్, అభి, రాజీవ్గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

