ఎంఓపీ ఎరువుల బస్తాలపై తనిఖీ
నాణ్యతపై ఫిర్యాదులతో శాంపిళ్ల సేకరణ
నమూనాలను ప్రయోగశాలకు పంపిన అధికారులు
మండల వ్యవసాయ అధికారి బన్న రజిత వెల్లడి
కాకతీయ, నల్లబెల్లి: ఎంఓపీ ఎరువుల నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్లో మండల వ్యవసాయ అధికారి బన్న రజిత శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఎరువుల బస్తాలను పరిశీలించి నమూనాలను సేకరించారు. సేకరించిన శాంపిళ్లను నాణ్యత నిర్ధారణ కోసం ప్రయోగశాలకు పంపించారు. పరీక్ష ఫలితాలు వచ్చిన అనంతరం తదుపరి విచారణ చేపట్టి, నివేదిక ఆధారంగా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఎరువుల కొరతను అరికట్టడంతో పాటు అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అవసరం లేని పురుగుమందులను ఎరువుల బస్తాలతో కలిపి విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో మండలంలోని అన్ని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

