కాకతీయ ఎఫెక్ట్..
వాడుకలోకి వైకుంఠ రథం
వార్తా కథనానికి అధికారుల తక్షణ స్పందన
కాకతీయ, రాయపర్తి: ‘కాకతీయ’ కథనానికి అధికారులు స్పందించారు. గత కొంతకాలంగా మూలనపడి నిరుపయోగంగా ఉన్న వైకుంఠ రథానికి మరమ్మతులు పూర్తి చేసి వాడుకలోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 1న ‘ఉత్తరం కాకతీయ’ దినపత్రికలో ‘మూలనపడి మూలుగుతున్న వైకుంఠ రథం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన స్థానిక సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి గుగులోత్ యాకుబ్ నాయక్ వాహనంలోని సాంకేతిక లోపాలను సరిచేయించారు. వైకుంఠ రథం అందుబాటులో లేక గతంలో అంతిమయాత్రలకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోయామని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం వాహనం అందుబాటులోకి రావడంతో హర్షం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించిన పంచాయతీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీలో ఉన్న ఫ్రీజర్ బాక్స్ను కూడా ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

