epaper
Sunday, September 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

10ఏళ్ల‌లో వేల కోట్లు ఎట్లా సంపాదించారు

10ఏళ్ల‌లో వేల కోట్లు ఎట్లా సంపాదించారు
వ‌చ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే ఉప‌యోగ‌ప‌డింది
2014లో ఒక్క ఎకరం లేదన్న వారికిప్పుడు వందల ఎకరాలు?
ఆస్తుల వివరాలు చెప్పకుండా ఎదురుదాడి ఏం వైఖ‌రి?
దేవాదుల నీటితో స్టేషన్‌ఘన్‌పూర్‌ రైతులకు సాగునీరు
అవినీతి, అక్రమాలకు తావులేకుండా పథకాల అమలు
మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కాక‌తీయ‌, ధ‌ర్మ‌సాగ‌ర్ :  2014లో ఒక్క ఎకరం కూడా లేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న కల్వకుంట్ల కుటుంబానికి 2026 నాటికి వందల ఎకరాలు, వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు. 2014కు ముందు కేసీఆర్‌ కుటుంబం ఆస్తుల విలువ ఎంత, ఇప్పుడు ఉన్న ఆస్తుల విలువ ఎంత అన్నది వెల్లడించాలని ప్రశ్నించారు. తెలంగాణ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ తెలంగాణ వనరులను దోచుకుని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుందని విమర్శించారు. ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పకుండా ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక్క ఎకరం భూమి ఇచ్చారా, ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నించారు. ధర్మసాగర్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మసాగర్‌ మండలానికి చెందిన 36 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు రూ.36,04,176 విలువైన చెక్కులను, 33 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు రూ.17,11,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు.
కరువులోనూ స్టేషన్‌ఘన్‌పూర్‌కు సాగునీరు
రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో సాగునీటి ఇబ్బందులు లేకపోవడానికి దేవాదుల ప్రాజెక్టే కారణమని కడియం శ్రీహరి అన్నారు. దేవాదుల ద్వారా రిజర్వాయర్లను నింపుకుని పంటలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. 20 ఏళ్ల క్రితం చిన్న మొక్కగా ప్రారంభమైన దేవాదుల ఎత్తిపోతల పథకం నేడు మహావృక్షంగా ఎదిగి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందిస్తోందన్నారు. తన రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన పని దేవాదుల ప్రాజెక్టేనని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్‌లో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
కల్యాణలక్ష్మితో పేద కుటుంబాలకు భరోసా
కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని కడియం శ్రీహరి అన్నారు. ఆడపిల్ల వివాహం చేయాలంటే తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రభుత్వం అందించే రూ.1,00,116 ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్పిస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రైతులు, మహిళలు, పేద వర్గాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రేషన్‌ షాపుల ద్వారా సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతోపాటు మహిళా సంఘాలకు వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలు, వ్యాపార, పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వంపై అప్పుల భారం ఉన్నా సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పేద వర్గాల సంక్షేమానికి, సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట వేస్తున్నారని కడియం శ్రీహరి తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులు వివాహం జరిగిన వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న 3 నెలల్లో ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిధి, ఇతర ప్రభుత్వ పథకాల కోసం ఎవరూ ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు నేరుగా అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు నిజాయితీగా పనిచేయాలని సూచించారు.
10 ఏళ్ల ఆస్తుల లెక్క చెప్పాలి
కల్వకుంట్ల కుటుంబానికి 2014కు ముందు ఉన్న ఆస్తులు, 2026 నాటికి ఉన్న ఆస్తుల వివరాలను ప్రజల ముందుంచాలని కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో 2014లో ఒక్క ఎకరం కూడా లేదని పేర్కొన్న వారు ఇప్పుడు వందల ఎకరాలు ఎలా సంపాదించారో వివరించాలని ప్రశ్నించారు. 10 ఏళ్లలో వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పకుండా తమపై ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. తెలంగాణ వనరుల వినియోగం, గత ప్రభుత్వ పాలన, కుటుంబ ఆస్తుల పెరుగుదలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై ఉందని అన్నారు.
పథకాలకు ఒక్క రూపాయి ఇవ్వొద్దు
ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులు ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మీకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే వస్తాయని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిజాయితీగా పనిచేసి అర్హులైన నిరుపేదలకే పథకాలు అందేలా చూడాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అవినీతి, అక్రమాలకు ఎలాంటి అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌, ఎంపీడీవో, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా వినిపించాలి

విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా వినిపించాలి పేపర్‌ లీకేజీలు, పరీక్షల జాప్యాలకు అడ్డుకట్ట వేయాలి విద్యార్థులు,...

లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో వ్యక్తి మృతి

లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో వ్యక్తి మృతి గూడెప్పాడు శివారులో జాతీయ రహదారిపై ప్రమాదం లారీ...

గ్రామ అవసరాలే ప్రణాళికకు ప్రాతిపదిక

గ్రామ అవసరాలే ప్రణాళికకు ప్రాతిపదిక 375 రకాల పనుల్లో ప్రాధాన్య పనుల గుర్తింపు ప్రజల...

ఈ డాక్ట‌ర్లు మార‌రా..?!

ఈ డాక్ట‌ర్లు మార‌రా..?! రాయపర్తి పీహెచ్‌సీలో ఉదయమూ కనిపించని డాక్టర్లు  ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాలు...

కడియం.. రెడీగా ఉండు!

కడియం.. రెడీగా ఉండు! దానం నాగేందర్‌లాగే నీపైనా అనర్హత వేటు తప్పదు ఫిరాయింపులపై హైకోర్టు...

రహుమునిషా బేగంకు పరామర్శ

రహుమునిషా బేగంకు పరామర్శ కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: తెలంగాణ ఉద్యమ నాయకురాలు రహుమునిషా...

నిమజ్జనానికి సర్వం సిద్ధం చేయండి

నిమజ్జనానికి సర్వం సిద్ధం చేయండి ఆదివారం లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి చెరువుల్లో...

జీఐఎస్‌తో ప్రతి ఆస్తి లెక్క తేల్చండి

జీఐఎస్‌తో ప్రతి ఆస్తి లెక్క తేల్చండి సమగ్ర ప్రాపర్టీ సర్వేకు పకడ్బందీ కార్యాచరణ సర్వేను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.