epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎసరు ఎదురు చూపు!

ఎసరు ఎదురు చూపు!
రేషన్ షాపుల్లో మూలుగుతున్న వరద బాధితుల బియ్యం
రెండు నెలలకు గానీ విడుదల కాని ఆహార సాయం
15 రోజులైనా పంపిణీకి నోచుకోని బియ్యం
ముహూర్తం కోసం వేచిచూస్తున్నామంటున్న అధికారులు
ఎమ్మెల్యేలు కరుణించే వరకు ఎసరు మరగాల్సిందేనా?

కాకతీయ, వరంగల్ : రెండు నెలల క్రితం వరంగల్ ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. హన్మకొండ, వరంగల్ పట్టణాల్లో పలువురు సర్వస్వం కోల్పోయిన సంగతి విదితమే. కొన్నిచోట్ల ఇంట్లో సామగ్రి కూడా కొట్టుకుపోయి నిరాశ్రయులుగా మారారు. వరద తగ్గుముఖం పట్టాక ఎప్పటిలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. పరామర్శించారు. ముఖ్యమంత్రి సైతం వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, ఆర్థిక సాయం ప్రకటించారు. తాజాగా, వరద బాధితులకు బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆ బియ్యం ఇప్పుడు రేషన్ షాపుల్లో మూలుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15రోజులుగా ఆ బియ్యం ఎసరు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు కరుణిస్తేనే!

వరంగల్, ఖిల్లా వరంగల్ మండల పరిధిలలో వరద బాధితులకు మంజూరైన బియ్యం రేషన్ షాపులకు చేరాయి. వరంగల్ లోని పైడిపల్లి పరిధిలో 21 కుటుంబాలు.. 61 మందికి మనిషికి ఆరు కిలోల చొప్పున 366 కిలోలు, ఏనుమాముల పరిధిలో 81 కుటుంబాలు.. 243 మందికి 1458 కిలోలు, గిర్మాజీపేట పరిధిలో 101 కుటుంబాలు.. 286మందికి 1716 కిలోలు, రామన్నపేట పరిధిలో 1415 కుటుంబాలు.. 4317 మందికి 25902 కిలోలు కాగా వరంగల్ మండల పరిధిలో మొత్తంగా 1620 కుటుంబాల్లో 4907 మందికి గాను 29442 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. అలాగే ఖిల్లా వరంగల్ మండల పరిధిలో 1417 కుటుంబాలల్లో 4630 మందికి ఆరు కిలోల చొప్పున 27780 కిలోల బియ్యాన్ని డిసెంబర్ 5న ఆయా రేషన్ డీలర్లకు విడుదలయ్యాయి. వీటిని పంపిణీ చేసేందుకు ఒక్కో ఏరియాకు అధికారులను కూడా నియమించారు. ఏయే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలో కూడా నివేదిక సిద్ధం చేశారు. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా ఈ బియ్యం పంపిణీకి ఎమ్మెల్యేల రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల చేతులమీదుగా పంపిణీ చేయాలని, వారి కోసమే ఎదురుచూస్తున్నట్లు కొందరు అధికారులు పేర్కొనడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఒకటి రెండు రోజుల్లో పంపిణీ చేయాల్సింది పోయి..!

వరదల్లో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారిన వారికి తక్షణ సాయం కింద ఒకటి రెండు రోజుల్లో పంపిణీ చేయాల్సింది పోయి.. వరదలు వచ్చి రెండు నెలలకు గానీ సర్కారు కళ్లు తెరవలేదు. దానికి కూడా ఎమ్మెల్యేల రూపంలో పంపిణీకి ఆటంకాలు ఏర్పడడం ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే పాలకుల తీరు హాస్యాస్పదం అనిపిస్తోంది. ఇప్పటికే బియ్యం డీలర్ల వద్దకు చేరకుని 15రోజులు దాటుతోంది. మరి ఇంకెంతకాలం పడుతుందో చెప్పలేమని అధికారులు పేర్కొనడం విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు లేదా మంత్రి స్పందించి.. వారున్నా లేకపోయినా.. బియ్యం పంపిణీకి అనుమతిస్తారని ఆశిద్దాం! లేదంటే.. మతిలేనోడు దుకాణం పోతే.. ఇంట్లో ఎసరు మరిగి ఆవిరైనట్లుగా ఉంటుంది.. వరద బాధితుల బియ్యం పంపిణీ!

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.