epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం!

ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం!
బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేత
కాంగ్రెస్ ఏడాదిలోనే మరో 1500 స్కూల్స్‌కు తాళాలు వేసింది
ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలతో కాలేజీలు మూత
విద్యార్థులపై భారం పెడితే ఉద్యమమే
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న బండి సంజయ్

కాకతీయ, హైదరాబాద్ : బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలన ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్య విఫలమైతే ఒక తరం నష్టపోతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో అదే జరుగుతోందని ఆయన హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ శంషాబాద్‌లోని ఎస్సాస్సార్ కన్వెన్షన్‌లో జరిగిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో 6 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని తెరవకపోగా ఒక్క ఏడాదిలోనే మరో 1500 స్కూల్స్ మూసివేశారని విమర్శించారు. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్న హామీ గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో వందలాది కాలేజీలు మూతపడుతున్నా ప్రభుత్వం స్పందించడంలేదని ఆరోపించారు. గత నాలుగేళ్లుగా దాదాపు రూ.10 వేల కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఈ విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. విద్యా రంగ సమస్యలపై ఏబీవీపీ చేస్తున్న ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.

నల్లజెండాలు టెర్రరిస్టులవి… ఏబీవీపీదే జాతీయ జెండా

దేశంలో నల్లజెండాలు ఎగరేసేది టెర్రరిస్టులు, నక్సలైట్లు మాత్రమేనని బండి సంజయ్ విమర్శించారు. నల్లజెండాలను ఎదిరిస్తూ జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించింది ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలేనని గుర్తు చేశారు. 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం కోసం పోరాడిన చరిత్ర ఏబీవీపీదేనని తెలిపారు. అమరుల త్యాగాల స్పూర్తితోనే మోదీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం సాధించిందన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా పానగల్‌కు చెందిన సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్‌కు ‘జనమంచి గౌరీశంకర్ జీ యువ పురస్కార్’ను కేంద్ర మంత్రి బండి సంజయ్ అందజేశారు. హెచ్ఐవీ బాధితులు, వారి పిల్లల కోసం చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.
జనమంచి గౌరీశంకర్ జీ ఏబీవీపీకి ఐకాన్ అని, విద్యా సమస్యలపై పోరాటాలు చేసి ఎంతో మంది విద్యార్థి నాయకులను తయారు చేసిన నేత అని కొనియాడారు. నక్సల్స్ బెదిరింపులను ఎదుర్కొంటూ కూడా ఏబీవీపీ సిద్ధాంతాల కోసం నిలబడిన నాయకుడిగా ఆయనను గుర్తు చేశారు.

విద్య విఫలమైతే… తరం నష్టమే

పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో స్కూళ్లలో టీచర్లు లేరు, మౌలిక వసతులు లేవు, అయినా ప్రభుత్వానికి సిగ్గు లేదని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనతో రెండు తరాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. గౌరీశంకర్ జీ స్పూర్తితో విద్యా రంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని ఈ మహాసభల వేదికగా ఏబీవీపీ నాయకులను కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.