జాతీయ జెండా ఆవిష్కరించిన తహసీల్దార్
ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కాకతీయ,ఆత్మకూరు : స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆత్మకూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఆత్మకూరు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు స్వాతంత్ర సమరయోధులు త్యాగఫలమే నేటి 80 వ స్వాతంత్ర వేడుకలు అని స్వాతంత్ర కొరకు ఎందరో ప్రాణత్యాగాలు చేసారని తహసీల్దార్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.అనంతరం ఎంపీడీఓ కార్యాలయం లో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి జెండా ఆవిష్కరించి అందరికి 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పోలీస్ స్టేషన్ లో సిఐ సంతోష్ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు..

