ఉద్యమకారుల హక్కుల సాధనకు ఐక్యంగా కదలాలి
ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమల్ల రవికుమార్
కాకతీయ, హనుమకొండ: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, హక్కుల సాధన కోసం నిర్వహించనున్న ఓదార్పు యాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్ నేతృత్వంలో చేపట్టనున్న యాత్ర పోస్టర్ను మంగళవారం ఎర్రగట్టుగుట్ట సర్కిల్లో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ఇన్చార్జీల సమక్షంలో హసన్పర్తి మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మేకల కన్నయ్య, ప్రధాన కార్యదర్శిగా సౌరం రవీందర్, ఉపాధ్యక్షులుగా గోపనబోయిన రవీందర్, మెరుగుత్తి రఘు, ఆరెపల్లి రాజు, తంగేళ్లపెల్లి కోటేశ్వర్ ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా రుద్రారపు రవీందర్, దాట్ల ప్రభాకర్ను ఎన్నుకున్నారు. మహిళా కమిటీ అధ్యక్షురాలిగా మోతపోతుల లక్ష్మి, ఉపాధ్యక్షులుగా సిరిమల్ల గాయత్రి, కందగట్ల రమ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో అనుముల రమేష్, మొగసాల దేవేందర్రెడ్డి, గోపనబోయిన రాజు, మేకల రవీందర్, ఇమ్మడి శెట్టి రాజు, సౌరం స్వర్ణలత, గుంటి పద్మ, దార సూరి, బెరిగేలా కృష్ణమూర్తి, బైరి రమేష్, జక్కుల స్వామి, జీనుకల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

