epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇది ధైర్యవంతుల నేల.. మీ వెంటే నేను.. మణిపూర్ హింస బాధితులతో ప్రధాని మోదీ..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మణిపూర్ స్ఫూర్తికి వందనం. మీ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రాష్ట్రం ఈశాన్యానికి ప్రకాశాన్ని జోడించే రత్నం అని అన్నారు. గతంలో హింస మణిపూర్‌ను కుదిపివేయడం బాధాకరమని, అయితే ఇప్పుడు ఆశ, విశ్వాసాల కొత్త ఉదయం ప్రారంభమవుతోందని తెలిపారు. కుకీలు, మెయిటీల మధ్య చర్చలు సాగుతున్నాయని, ప్రజలు శాంతి మార్గం వైపు అడుగులు వేస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు.

మణిపూర్ ప్రజలతో నేను ఉన్నాను. భారత ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. నిర్వాసితుల కోసం రూ.500 కోట్ల ప్యాకేజ్ కేటాయించాం. మణిపూర్ అభివృద్ధి తిరిగి సరైన దారిలో పయనించేలా నేను కృషి చేస్తాను అని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ సందర్శనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ.7 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు కొండ ప్రాంతాలు, గిరిజన సమాజం సహా మణిపూర్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని ఆయన పేర్కొన్నారు.

మణిపూర్ ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కనెక్టివిటీ అని మోదీ గుర్తుచేశారు. గతంతో పోలిస్తే రైలు, రోడ్ల బడ్జెట్‌ను అనేక రెట్లు పెంచినట్లు చెప్పారు. వందలాది గ్రామాలకు రోడ్లు కల్పించారని, జిరిబామ్–ఇంఫాల్ రైల్వే లైన్ పూర్తయ్యాక రాజధాని ఇంఫాల్ దేశ రైల్వే నెట్‌వర్క్‌తో కలుస్తుందని తెలిపారు. కొండలు, లోయలలోని వివిధ సమూహాలతో ఇటీవల జరిగిన చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని ప్రధాని అన్నారు. సంభాషణ, పరస్పర గౌరవం, అవగాహనలతో శాంతి సాధ్యమని, అందరూ శాంతి మార్గంలో నడవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మణిపూర్‌లో ఉపాధి అవకాశాలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ప్రధాని తెలిపారు. గతంలో ఢిల్లీ నుంచి ప్రకటనలు మణిపూర్‌కి చేరుకోవడానికి దశాబ్దాలు పట్టేవి. ఇప్పుడు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది అని అన్నారు. దేశవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మించే పథకం కింద మణిపూర్‌లో కూడా వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. 7–8 సంవత్సరాల క్రితం వరకు 25–30 వేల ఇళ్లకే పైపుల ద్వారా నీరు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 3.5 లక్షల ఇళ్లకు పైపుల నీటి సౌకర్యం కల్పించామని వివరించారు.

కొండ ప్రాంతాల్లో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు కల అనిపించేవని ప్రధాని గుర్తుచేశారు. అయితే చురచంద్‌పూర్‌లో కొత్తగా వైద్య కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే పిఎం-దేవైన్ పథకం కింద ఐదు కొండ జిల్లాల్లో ఆధునిక ఆరోగ్య సేవలను అభివృద్ధి చేస్తున్నామని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఒక్క మణిపూర్‌లోనే 2.5 లక్షల రోగులు ఉచిత చికిత్స పొందారని వివరించారు. మొత్తం మీద ప్రధాని మోదీ ప్రసంగంలో మణిపూర్ అభివృద్ధి, శాంతి, ఉపాధి, ఆరోగ్య సదుపాయాలపై స్పష్టమైన దిశను సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.