epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏటీఎంల‌లో రేకు అడ్డం పెట్టి దోచేస్తారు

ఏటీఎంల‌లో రేకు అడ్డం పెట్టి దోచేస్తారు
ఏటీఎంలో చోరీల‌కు పాల్ప‌డుతున్న ముఠా అరెస్టు
వరంగల్ ట్రైసిటీలో 7 ఏటీఎంలలో రూ.12.10 లక్షల చోరీ
దేశవ్యాప్తంగా 40కి పైగా ఏటీఎం చోరీల రికార్డు
టెక్నాలజీతో ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

కాకతీయ, వరంగల్ బ్యూరో : ఏటీఎం మిషన్లలో డబ్బులు బయటకు రాకుండా ఇనుప రేకును అమర్చి ఖాతాదారులను మోసం చేస్తూ చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర ముఠా గుట్టును వరంగల్ పోలీసులు ఛేదించారు. వరంగల్ సీసీఎస్‌, కాజీపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.5.10 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు ఆరిఫ్ ఖాన్, సర్ఫరాజ్, ఎం. ఆష్ మహ్మద్, షాపుస్ ఖాన్, షారూఖాన్, అస్లాం ఖాన్, ఎం. షారుఖాస్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లా మాల్కిడా తాలూకాకు చెందినవారిగా వెల్లడించారు.

ఏటీఎం చోరీల వెనుక ముఠా ప్లాన్

డీసీపీ కవిత వెల్లడించిన వివరాల ప్రకారం… ఒకే ప్రాంతానికి చెందిన ఈ నిందితులు మద్యం సేవిస్తూ సన్నిహితంగా గడుపుతూ, ఖర్చులకు డబ్బు లేకపోవడంతో సులభంగా సంపాదించేందుకు నేర మార్గాన్ని ఎంచుకున్నారు. ఓ పరిచయస్తుడి ద్వారా ఎస్‌బీఐకి సంబంధించిన పెర్టో కంపెనీ పాత ఏటీఎం మిషన్ల లోపాలను తెలుసుకుని, వాటిని తెరవడానికి నకిలీ తాళం చెవులు తయారు చేసుకున్నారు. ముందుగా పెర్టో ఏటీఎంలను గుర్తించి, మిషన్‌లో డబ్బులు బయటకు వచ్చే మార్గంలో గమ్‌తో ఇనుప ప్లేట్ అమర్చేవారు. ఖాతాదారుడు నగదు డ్రా చేస్తే డబ్బు బయటకు రాకుండా మిషన్‌లోనే ఆగిపోయేది. నగదు రాకపోవడంతో ఖాతాదారుడు మిషన్ లోపంగా భావించి వెళ్లిపోతాడు. అనంతరం నిఘా పెట్టిన ముఠా సభ్యులు మళ్లీ ఏటీఎం తెరిచి లోపల నిలిచిపోయిన నగదును దోచుకునేవారు. ఖాతాదారుడికి మాత్రం నగదు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చేది.

దేశవ్యాప్తంగా 40కి పైగా చోరీలు

ఈ పద్ధతితో నిందితులు రాజస్థాన్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో 40కి పైగా ఏటీఎం చోరీలకు పాల్పడ్డారు. పాత మిషన్ల స్థానంలో కొత్త ఏటీఎంలు ఏర్పాటు కావడంతో కొన్ని రాష్ట్రాల్లో వీరి కార్యకలాపాలు తగ్గగా, ఇటీవల వరంగల్ ట్రైసిటీని లక్ష్యంగా చేసుకున్నారు. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు వరంగల్ ట్రైసిటీలోని 7 ఏటీఎంలలో చోరీలు చేసి రూ.12.10 లక్షల నగదు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుబేదారి పరిధిలో నాలుగు, కాజీపేట, హనుమకొండ, మిల్స్ కాలనీ పరిధిలో ఒక్కొక్క ఘటన నమోదైంది. ఈరోజు ఉదయం కాజీపేట చౌరస్తా సమీపంలోని పెర్టో ఏటీఎం వద్ద మరోసారి చోరీకి ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. పారిపోవడానికి యత్నించినా పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాలను అంగీకరించారు. కేసును ఛేదించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఏసీపీలు సదయ్య, ప్రశాంత్ రెడ్డి, సీసీఎస్ ఎస్‌ఐ శ్రీనివాస్ రాజు, కాజీపేట ఎస్‌ఐలు నవీన్ కుమార్, లవణ్ కుమార్‌తో పాటు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.