epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పరిహారం ఎప్పుడిస్తారు..? స్పష్టత ఇవ్వండి!

పరిహారం ఎప్పుడిస్తారు..? స్పష్టత ఇవ్వండి!
సిగాచి బాధితులపై ప్రభుత్వ వైఖరికి హైకోర్టు ఆగ్రహం
ఎంత ఇస్తామన్నారో.. ఎంత ఇచ్చారో చెప్పాలంటూ ప్రశ్నలు
సిట్‌ పరిహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశం

కాకతీయ, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుల పరిహారంపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. పరిహారం విషయంలో స్పష్టత లేదంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. “ఎంత పరిహారం ఇస్తామని చెప్పారు? ఇప్పటివరకు ఎంత ఇచ్చారు? మిగతా మొత్తాన్ని ఎప్పుడు ఇస్తారు?” అంటూ న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సిగాచి ఫార్మా ప్రమాదంలో మృతి చెందిన 56 మంది, ఆచూకీ లభించని 8 మంది, 28 మంది క్షతగాత్రులకు న్యాయం చేయాలని కోరుతూ బాబురావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాధితులకు తగిన పరిహారం చెల్లించడంతో పాటు, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ఆయన కోర్టును కోరారు.

ప్రభుత్వంపై న్యాయమూర్తి మండిపాటు
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి పరిహారం పంపిణీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు ఇంకా నిరీక్షణలో ఉండగా, స్పష్టమైన షెడ్యూల్ లేకపోవడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. పరిహార ప్రకటనలు మాత్రమే సరిపోవని, అమలు ఎలా జరుగుతోందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిహారం పంపిణీకి సంబంధించిన అంశాలపై సిగాచి ఫార్మా కంపెనీ స్పష్టమైన వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కంపెనీ ప్రకటించిన పరిహారంతో పాటు, చట్టప్రకారం బాధితులకు అందాల్సిన పరిహారం ఎంత అనే వివరాలను కూడా కోర్టుకు సమర్పించాలని తెలిపింది. ఈ అంశంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కీలక శాఖలకు నోటీసులు
ఈ కేసులో అపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండళ్లను సుమోటో ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది. పరిహారానికి సంబంధించిన చట్టపరమైన బాధ్యతలు ఎలా నిర్వర్తించారో వివరించాలని ఆదేశించింది. ప్రమాదం జరిగి చాలా కాలం గడిచినా పరిహారం విషయంలో స్పష్టత లేకపోవడం బాధిత కుటుంబాల్లో ఆందోళనను పెంచుతోంది. హైకోర్టు తాజా ఆదేశాలతో అయినా ప్రభుత్వం, కంపెనీ బాధ్యతగా స్పందించి బాధితులకు న్యాయం చేస్తాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. కోర్టు తదుపరి విచారణలో ప్రభుత్వ వివరణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.