epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నర్సంపేటలో ‘మట్టి’ మాఫియా రాజ్యం

నర్సంపేటలో ‘మట్టి’ మాఫియా రాజ్యం
అధికార పార్టీ అండదండలతో సహజ వనరుల దోపిడీ
అధికారులపై దాడులు పాలకపక్ష అహంకారానికి నిదర్శనం
మట్టి తవ్వకాల దందాపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి
ప్రశ్నించిన అధికారులపై దాడులు జరిగినా ఎమ్మెల్యే మౌనం ఎందుకు?
న‌ర్సంపేట‌లో ప‌రి పాలన పూర్తిగా గాడి తప్పింది
మట్టి దందాలో భాగస్వాములపై ఉక్కుపాదం మోపాలి
న‌ర్సంపేట‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌

కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట నియోజకవర్గంలో అధికార పార్టీ అండదండలతో మట్టి మాఫియా చెలరేగిపోతోందని, సహజ వనరుల దోపిడీకి అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలకు అధికార పార్టీ నాయకులే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల సంపదను కొందరు కాంగ్రెస్ నాయకులకు అప్పగించి దోచిపెడుతున్నారని ఆయన విమర్శించారు. మట్టి, మొరం దందాలు బహిరంగంగా సాగుతున్నా ప్రభుత్వం, అధికారులు ప్రేక్షకపాత్ర పోషించడం అనుమానాలకు తావిస్తోందని సుదర్శన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి మట్టి అనుమతులు ఇచ్చారు, ఎంత మట్టి తరలించారు, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది అనే వివరాలను వెంటనే ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. నెక్కొండ మండలంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల పేరుతో పరిమిత అనుమతులు తీసుకుని, భారీగా మట్టిని తరలిస్తున్నారని పేర్కొన్నారు.

అధికారులకే రక్షణ లేని పాలన
మట్టి తవ్వకాలపై ప్రశ్నించిన అధికారులపైనే దాడులు జరగడం దారుణమని పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. విధులు నిర్వర్తిస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బందిపై దాడులు జరిగినా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. ఈ మౌనం దాడులకు పరోక్ష మద్దతుగా భావించాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. రంగయ్య చెరువు, రాజుపేట ప్రాంతాల్లో జరిగిన మట్టి తవ్వకాలపై అనేక అనుమానాలు ఉన్నాయని, అటవీ శాఖ పరిధిలో ఉన్న ప్రాంతాలకు ఇతర శాఖలు ఎలా అనుమతులు జారీ చేశాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఒక శాఖపై మరో శాఖ ఫిర్యాదులు చేసుకునే స్థాయికి పాలన దిగజారిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు.

ఉక్కుపాదం మోపాలి
నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పనిచేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. అధికారులకే రక్షణ లేని కాంగ్రెస్ పాలనలో సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. అక్రమ మట్టి దందాలో భాగస్వాములైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన వారిని వదిలిపెట్టరాదని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టే మాఫియాలపై ప్రభుత్వం వెంటనే ఉక్కుపాదం మోపాలని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.