మిన్నంటిన ఎర్రబెల్లి 70వ జన్మదిన వేడుకలు
అభిమానం చాటుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
కాకతీయ,రాయపర్తి : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు రాయపర్తి మండల కేంద్రంలో మిన్నంటాయి.శనివారం ఎర్రబెల్లి అభిమానులు,పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా ఈ సంబరాలను జరుపుకున్నారు.ప్రయాణ ప్రాంగణం ఆవరణంలో పెద్ద ఎత్తున ఎర్రబెల్లి అభిమానులు,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి కేక్ కట్ చేశారు.ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వారు చేసిన నినాదాలు మారుమోగాయి.అలాగే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత,బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తన సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పదవుల్లో ఉన్న లేకున్నా ఎర్రబెల్లి ప్రజల మనిషిగా,వారి గుండెల్లో ఉంటారని స్పష్టం చేశారు.ఆయన ఆయురారోగ్యాలతో నూరేళ్లు వర్ధిల్లాలని,భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.ముఖ్య నాయకులు,కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి తరలివచ్చి బాణాసంచా కాలుస్తూ ఉదారత చాటుకున్నారు.ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మూనావత్ నరసింహ నాయక్,మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి,మాజీ జెడ్పిటిసి రంగు కుమార్,కుందూరు రామచంద్రారెడ్డి,పూస మధు,లేతాకుల రంగారెడ్డి,
సురేందర్ రాథోడ్,గారె నర్సయ్య,ఐత రాంచందర్,కర్ర రవీందర్ రెడ్డి,చందు రాము,చందు సతీష్,చిలువేరు సాయి గౌడ్,ఎండీ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

