జీడబ్ల్యూఎంసీ ఎన్నికలే లక్ష్యం
ఎన్నికలకు కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహం
డివిజన్ల వారీగా బలాబలాలపై మంత్రి పొంగులేటి సమీక్ష
క్షేత్రస్థాయి బలోపేతంపై ప్రత్యేక దృష్టి
ఓటర్ల జాబితాపై పక్కా నిఘా..
డీసీసీ భవన్కు భూమిపై సానుకూల స్పందన
పొంగులేటి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
కాకతీయ, హన్మకొండ : రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. డివిజన్ల వారీగా పార్టీ బలాబలాలను అంచనా వేసి, స్థానిక సమస్యలను గుర్తించి గెలుపు వ్యూహాలను అమలు చేయాలని సూచించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జిల్లా ముఖ్య నాయకులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ భవన్కు వచ్చిన మంత్రికి ఇనగాల వెంకట్రామ్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు.
ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి
ప్రస్తుత ఓటర్ల జాబితాలోని తప్పుడు చిరునామాలు, బోగస్ ఓట్లు, నాన్ మ్యాపింగ్ ఓటర్లను గుర్తించి అవసరమైన సవరణలు, తొలగింపులు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జాబితాను సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజల మద్దతు కూడగట్టాలని నూతన మండల, డివిజన్ అధ్యక్షులకు సూచించారు. హనుమకొండ జిల్లా నూతన డీసీసీ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయింపు ప్రతిపాదనను రాబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టి త్వరగా ఆమోదం లభించేలా చొరవ తీసుకోవాలని జిల్లా నాయకులు పొంగులేటిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. పీఏసీఎస్లు, స్టేట్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల భర్తీని పారదర్శకంగా చేపట్టాలని, ప్రతిపాదనలను డీసీసీ ద్వారా రాష్ట్ర కమిటీకి పంపేలా సమన్వయం చేయాలని నిర్ణయించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన 13 మండల అధ్యక్షులు, 10 డివిజన్ అధ్యక్షులతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కె.ఆర్.నాగరాజు, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితెల ప్రణవ్, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కిసాన్ కాంగ్రెస్ హనుమకొండ చైర్మన్ పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి, మాజీ మేయర్ గుండు సుధారాణి, వివిధ చైర్మన్లు రియాజ్, అజీజ్ఖాన్, టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఈవీ శ్రీనివాస్రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, అనుబంధ సంఘాల చైర్మన్లు, నూతనంగా నియమితులైన 13 మండల అధ్యక్షులు, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 10 డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.

