గీసుగొండలో భారీ బందోబస్తు
కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో ముందస్తు చర్యలు
ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాల్లో నిఘా
సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు
కాకతీయ, గీసుగొండ : కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో గీసుగొండ మండలంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మండల కేంద్రంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కవాతు నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, రహదారులు, సున్నిత ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రజలు సంయమనం పాటించాలని పోలీసులు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు.

