epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’
ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్ సింగ్ విధులు
యూనిఫాం ప‌క్క‌న పెట్టి బ‌నీన్‌పైనే డ్యూటీ
ఇప్ప‌టికే సార్‌పై అవినీతి ఆరోపణల వెల్లువ
సెల‌వు రోజుల్లోనూ సార్ సైన్‌తో లైసెన్స్‌, స‌ర్టిఫికెట్లు జారీ
ఆధారాల‌తో బ‌య‌ట‌పెట్టిన కాక‌తీయ‌.. అయినా డీటీవోపై నో యాక్ష‌న్‌
డ్రైవింగ్‌ టెస్టులోనూ ‘ముడుపులు’ ఇస్తేనే పాస్‌?
రవాణా శాఖ అధికారి తీరుపై విమర్శలు
సార్ బాగోతాల‌పై కాక‌తీయ ప్ర‌తినిధికి ఫోన్లు..!

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రవాణా శాఖ కార్యాలయం పెద్ద సారు నేను చెప్పిందే వేదం, నా మాట వినకుంటే బతుకులు చిద్రమే అన్న తీరు గా వ్యవహరిస్తూ కార్యాలయంలో అర్థనగ్నంగా డ్యూటీ చేయడం అటు కార్యాలయ సిబ్బంది లోను, ఇటు వాహనదారుల నుండి తీవ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రవాణా శాఖ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయంటూ దరఖాస్తుదారులు, వాహనదారులు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) ఠాకూర్‌ ఈశ్వర్‌సింగ్‌ వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బ్రోకర్లను కలిస్తేనే పని ముందుకు…?

ములుగు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నిబంధనల ప్రకారం దరఖాస్తుల పరిశీలన జరగాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలు సక్రమంగా లేకుంటే సంబంధిత అధికారులు వాటిని తిరస్కరించడం లేదా లోపాలను సరిచేయాలని సూచించడం సాధారణ ప్రక్రియ. అయితే ములుగు కార్యాలయంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని పలువురు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో తమకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్న బ్రోకర్లను ఆశ్రయిస్తేనే పనులు సులభంగా పూర్తవుతున్నాయని, లేదంటే దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటున్నాయని వారు చెబుతున్నారు. సరైన పత్రాలు లేని దరఖాస్తులను సైతం ముందుకు తీసుకెళ్లాలని కింది స్థాయి సిబ్బందిపై డి టి ఓ ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సిబ్బందిపై ఒత్తిళ్లంటూ ఆరోపణలు

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తులను తిరస్కరించే కింది స్థాయి ఉద్యోగులు పైస్థాయి నుంచి వచ్చే ఆదేశాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్యాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అధికారి ఆదేశాలను పాటించకపోతే కక్షసాధింపు చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో కొందరు ఉద్యోగులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కార్యాలయంలో కిందిస్థాయి ఉద్యోగులను దుర్భాషలాడుతూ చిన్నా పెద్ద తప్పులని చూడకుండా వారి పై ఇష్టం వచ్చినట్టు కార్యాలయంలో అందరి ముందు కేకలు వేయటం, ఏది ఏమైనా నేను చెప్పింది చేయాల్సిందే లేకుంటే మీకు బతుకు ఉండదు అని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని సిబ్బంది కూడా సదరు ఉన్నతాధికారిపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

అర్ధన‌గ్నంగా డ్యూటీ..!

ములుగు జిల్లా రవాణా శాఖ అధికారులకు విధి నిర్వహణలో యూనిఫామ్‌ నిబంధనలు పక్కన పెడితే కనీసం పూర్తిగా దుస్తులు ధరించకుండా ఒంటిపై బనియన్ తో అర్థనగ్నంగా ములుగు డీటీఓ కార్యాలయంలో డ్యూటీ చేయటంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రవాణా శాఖ కార్యాలయంలో పనిపై పురుషులతోపాటు స్త్రీలు ధ్రువపత్రాల కోసం కార్యాలయానికి వస్తుంటారు. అయితే డ్యూటీ సమయంలో కనీసం సాధారణ దుస్తుల్లోనైనా ఉండాల్సిన అధికారి కార్యాలయంలో యూనిఫామ్‌ లేకుండా, మర్యాదపూర్వకమైన దుస్తులు కూడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కార్యాలయానికి వచ్చే ప్రజల తో పాటు సిబ్బంది ముందు అధికారి హోదాకు తగిన విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ బాధ్యత గల కుర్చీలో కూర్చొని బనియన్ పై అర్థనగ్నంగా డ్యూటీ చేయడం పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

‘లాగిన్‌’ వ్యవహారంపై ఏమైంది.?

ఇటీవల ములుగు రవాణా శాఖలో డీటీఓ లాగిన్‌ ఐడీ, డిజిటల్‌ సంతకం వినియోగానికి సంబంధించిన వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. అధికారి విధుల్లో లేని సమయంలో ఆయన పేరుతో డిజిటల్‌ సంతకాలతో ధ్రువపత్రాలు జారీ అయ్యాయనే ఆరోపణలు ఇప్పటికే ప్రశ్నలను లేవనెత్తాయి. ఈ వ్యవహారంపై సెప్టెంబర్‌ 2న డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ (డీటీసీ) వివరణ కోరినట్లు సమాచారం. అయితే దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేత ధోరణిలో వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు అధికారిక లాగిన్‌ వివరాలు ఎవరి వద్ద ఉన్నాయి? డిజిటల్‌ సంతకాన్ని ఎవరు వినియోగించారు? అధికారి విధుల్లో లేని సమయంలో ఆయన పేరుతో ధ్రువపత్రాలు ఎలా జారీ అయ్యాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

ఉన్నతాధికారుల మౌనం ఎందుకు?

ములుగు రవాణా శాఖ కార్యాలయంపై వరుసగా ఆరోపణలు వస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటివరకు సమగ్ర విచారణకు ఆదేశించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. లాగిన్‌, డిజిటల్‌ సంతకాల వ్యవహారం నుంచి మొదలుకొని బ్రోకర్ల ద్వారా పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలు, డ్రైవింగ్‌ టెస్టులపై అనుమానాలు, అధికారిపై వస్తున్న ఆస్తుల ఆరోపణలు.. ఇలా అనేక అంశాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో శాఖాపరమైన విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.

‘ఎవరికి వాటాలు….?’

ఇన్ని ఆరోపణలు వస్తున్నా చర్యలు ఎందుకు లేవన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అవినీతి ఆరోపణలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఫిర్యాదులపై విచారణ ఎందుకు జరగడం లేదు? అనే ప్రశ్నలు వాహనదారుల నుంచి వినిపిస్తున్నాయి. ‘అక్రమంగా సంపాదిస్తున్న సొమ్ములో ఉన్నతాధికారులకు కూడా వాటాలు ఉన్నాయా?’ అంటూ జిల్లా ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అనుమానాలకు తెరపడాలంటే ఉన్నతాధికారులు స్వతంత్రంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ములుగు రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్నాయంటూ వస్తున్న ఆరోపణలన్నింటిపైనా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. లాగిన్‌ వినియోగం, డిజిటల్‌ సంతకాలు, డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ, బ్రోకర్ల వ్యవహారం, దరఖాస్తుల పెండింగ్‌, అధికారిపై వచ్చిన ఆస్తుల ఆరోపణలు.. ఇలా ప్రతి అంశాన్ని పరిశీలించి తప్పు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మౌలిక వసతుల...

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా,...

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.