విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్ పాలన
వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్
ప్రజల సమస్యలు, హామీల అమలుపై సమాధానం చెప్పాలి
మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ నేతలు డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం దృష్టి మళ్లించే రాజకీయాలకు పాల్పడుతోందని పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ప్రజల సమస్యలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలపై సమాధానం చెప్పకుండా ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటారని పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.

