epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జన గణనకు రూ.11,718 కోట్లు

జన గణనకు రూ.11,718 కోట్లు
కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
2026-27లో దేశవ్యాప్తంగా రెండు దశల్లో నిర్వ‌హ‌ణ‌
పూర్తి డిజిటల్ పద్ధతిలో వివ‌రాల సేక‌ర‌ణ‌
వివ‌రాలు వెల్ల‌డించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: 2027 జనాభా లెక్కల నిర్వహణ కోసం ​కేంద్ర కేబినెట్ రూ.11,718 కోట్ల బడ్జెట్​ను ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ శుక్రవారం తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. 2026-27ల్లో దేశవ్యాప్తంగా 2 దశల్లో జనగణన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే జనగణన జరగాల్సి ఉంది. కానీ ఆనాడు కొవిడ్-19 మహమ్మారి విజృంభించడంతో జనాభా లెక్కల సేకరణను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తదుపరి జనగణన 2027లో జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. 2027 మార్చి 1ని రిఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. భారతదేశంలో 150 ఏళ్లకు పైగా జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. అందుకు సంబంధించిన రికార్డులు అన్నీ మన వద్ద ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దానికి కొనసాగింపుగా 2027 జనగణన చేయనున్నట్లు స్పష్టం చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ జనగణన భారత్​లో 16వది అవుతుంది. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత అయితే 8వది అవుతుంది. ఈ జనగణనలో దేశంలోని మొత్తం జనాభా, గృహాలు, సౌకర్యాలు, విద్య, ఆర్థిక కార్యకలాపాలు, వలసలు లాంటి అనేక అంశాల డేటాను సేకరించనున్నారు. వార్డు, గ్రామం, పట్టణం స్థాయిల్లో ఈ జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. 1948 జనాభా లెక్కల చట్టం, 1990 జనాభా లెక్కల నియమాల ఆధారంగా ఈ సెన్సెస్​-2027 జరగనుంది.

2 దశల్లో జనగణన

2025 జూన్​ 16న విడుదల చేసిన గెజిట్ ప్రకారం, ఈ జనగణన మొత్తం 2 దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ 2026 ఏప్రిల్​- సెప్టెంబర్​ మధ్య జరుగుతుంది. ఆయా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సౌలభ్యాన్ని అనుసరించి 30 రోజుల వ్యవధిలో ఇది నిర్వహించబడుతుంది. ఈ దశలో హౌస్ లిస్టింగ్​, హౌస్ సెన్సెస్​ నిర్వహిస్తారు. రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ దశలో జనాభా గణన చేస్తారు. అయితే లద్ధాఖ్​, జమ్మూకశ్మీర్​, హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ లాంటి మంచు ప్రాంతాల్లో, అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి 2026 సెప్టెంబర్​లో జనాభా లెక్కల సేకరణ చేస్తారు. భారత్​లో మొదటిసారిగా పూర్తి డిజిటల్ పద్ధతిలో జన గణన చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు. మొబైల్ అప్లికేషన్స్​ (ఆండ్రాయిడ్​, ఐఓఎస్​) ద్వారా డేటాను సేకరించి, దానిని మేనేజ్​మెంట్​ అండ్ మానిటరింగ్ సిస్టమ్​పోర్టల్​ ద్వారా రియల్ టైమ్​లో పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు స్వయంగా ఎన్యూమరేషన్ చేసుకోవడం కోసం, హౌస్​లిస్టింగ్ కోసం ప్రత్యేక టూల్స్​ ను కూడా ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.