epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేసీఆర్‌ది అంతా నటనే..

కేసీఆర్‌ది అంతా నటనే..
బ‌ల‌హీన‌మైన బీఆర్ఎస్‌ను కాపాడుకునే తాప‌త్ర‌యం
కొడుకు, అల్లుడు వల్ల పార్టీ మ‌రింత దిగజారుతోంది
నీళ్ల విషయంలో ఆయ‌న అనేక తప్పిదాలు చేశారు
బీజేపీ ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారు
యూరియా కొరతకు కేంద్రమే కారణం : మంత్రి జూపల్లి కృష్ణారావు
తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది : మంత్రి పొన్నం ప్ర‌భాకర్‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ బలహీనమైందని కేసీఆర్‌కు స్పష్టంగా అర్థమైందని, పార్టీని కాపాడుకోవాలనే తాపత్రయంతోనే ఆయన మళ్లీ బయటకు వచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కొడుకు, అల్లుడు కారణంగానే బీఆర్ఎస్ మరింత దిగజారుతోందన్న విషయం కేసీఆర్‌కే అర్థమైందన్నారు. పాలమూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదనడం పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్ ముందు చెప్పే మాటలకు, వెనక చేసే పనులకు పొంతన ఉండదని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఇరిగేషన్ కోసం కాదని, తాగునీటి కోసమేనని సుప్రీంకోర్టులో కేసీఆర్ ప్రభుత్వమే అఫిడవిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. నీళ్ల విషయంలో కేసీఆర్ అనేక తప్పిదాలు చేశారని, తెలంగాణ నీటి హక్కులను పూర్తిగా వినియోగించుకోవడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు.

బీజేపీ ప్రతి అడుగులోనూ బీఆర్ఎస్‌కు తోడుగా నిలిచిందని జూపల్లి ఆరోపించారు. జగన్ దగ్గరకు వెళ్లి రాయలసీమను ‘రత్నాల సీమ’గా చేస్తానని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. కానీ తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులు సాధించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టులపై ఇప్పుడు ప్రేమ చూపించడం అంతా రాజకీయ నటనేనని ఎద్దేవా చేశారు. యూరియాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ… యూరియా కొరతకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. సరఫరా తగ్గితే డిమాండ్ పెరగడం సహజమని, ఉన్న యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలని కోరడం తప్పా? అని ప్రశ్నించారు. రైతులు లైన్లలో నిలబడడం చూడలేకే ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకొస్తున్నామని తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఎందుకు పూర్తిస్థాయిలో తెరిపించలేకపోయారని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

ఇప్పటికే మీ తోలు ప్రజలే తీశారు

ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పార్లమెంట్, ఎమ్మెల్సీ, ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్‌కు తగిన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. శాసనసభకు రావాలని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ప్రతిపక్షం ఎందుకు దూరంగా ఉందని ప్రశ్నించారు. మీరు హాస్టల్ అద్దెలు పెండింగ్ పెడితే కాంగ్రెస్ చెల్లించిందని, గోదాముల్లో స్కూళ్లు నడిపితే ఇప్పుడు సొంత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. మా మీద ఆరోపణలు ఉంటే సభలో చర్చించాలన్నారు. కేసీఆర్‌పై ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా తమకు గౌరవం ఉందని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఉద్యోగాల హామీలపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని, ప్రజల తరఫున గట్టిగా పోరాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.