epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది
వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామన్నారు
బాండ్‌ పేపర్లపై రాసిచ్చి.. 1,000 రోజులైనా ఒక్క హామీ నెరవేర్చలేదు
18 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై నిలదీస్తాం
రైతులు, కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై సభలో ప్రశ్నిస్తాం
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి.. బాండ్‌ పేపర్లపై రాసిచ్చి మరీ ప్రజలను నమ్మించిన కాంగ్రెస్‌.. 1,000 రోజులు గడిచినా ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారని, ప్రజల తరఫున అన్ని అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. గన్‌పార్క్‌ వద్ద సోమవారం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల తరఫున అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడుగుతామని చెప్పారు. కేసీఆర్‌ను ఎన్ని రకాలుగా అవమానించినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారని తెలిపారు.

420 హామీలపై సమాధానం చెప్పాలి

వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌.. 1,000 రోజులు దాటినా ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు అభయహస్తంగా కనిపించిన కాంగ్రెస్‌.. ఎన్నికల తర్వాత బస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి బీఆర్‌ఎస్‌పై చేస్తున్న కుట్రలు కొత్తేమీ కాదని, గతంలోనూ ఎన్నో చూశామని అన్నారు. ప్రజల సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. నెల రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై కూలంకషంగా చర్చ జరగాలని కోరారు.

ఫీజు బకాయిలపై నిలదీస్తాం

18 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయో అసెంబ్లీలో ప్రశ్నిస్తామని కేటీఆర్‌ చెప్పారు. పాలిటెక్నిక్‌ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. 97 జీవోను రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కోసం తీసుకొచ్చారని విమర్శించారు. విద్యార్థులు, యువత సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. రైతాంగ సమస్యలపైనా చర్చిస్తామని చెప్పారు. రైతుల తరఫున ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబడతామని అన్నారు. సింగరేణి కార్మికులు, ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తెలిపారు.

22ఏలో ఆస్తులపై ప్రశ్నిస్తాం

22ఏ ద్వారా ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలే నిషేధిస్తారని కేటీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల బంధువులకు అక్రమంగా భూ కేటాయింపులు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడీలు, సర్వేయర్ల సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలకు అసెంబ్లీ వేదికగా పరిష్కారం చూపేలా ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. ప్రజల తరఫున ప్రశ్నించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

కాంగ్రెస్‌లోనే ఉంటారా..?

కాంగ్రెస్‌లోనే ఉంటారా..? బీజేపీలోకి వెళ్తే ఇముడుతారా..?! పొలిటికల్‌ క్రాస్‌రోడ్‌లో కొండా కపుల్స్‌ సంధికాలంలో నిర్ణయం సందిగ్ధమే..! బీజేపీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.