epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బండి కుమారుడిపై కేసు విచార‌ణ స్పీడ‌ప్‌

బండి కుమారుడిపై కేసు విచార‌ణ స్పీడ‌ప్‌
8న ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు చర్యలేవి?
డీజీపీ సీవీ ఆనంద్‌పై సీఎం రేవంత్‌ సీరియస్
ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో అంటూ డీజీపీ వివ‌ర‌ణ‌
నిష్పక్షపాత విచారణ చేప‌ట్టాల‌ని డీజీపీకి సీఎం ఆదేశం
కేసు దర్యాప్తు పర్యవేక్షణకు డీసీపీ రితిరాజ్‌ నియామకం
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సీరియస్.. ప్రత్యేక బెంచ్ ఏర్పాటు
కేసుతో పార్టీకి సంబంధం లేదన్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామచందర్‌రావు

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో విచారణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ, చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగిందని డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం ప్రశ్నించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల వల్ల జాప్యం జరిగిందని డీజీపీ వివరించగా, తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలను కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, ఐపీఎస్ కు అప్పగిస్తూ సోమవారం మెమో జారీ చేశారు.

మహిళా అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు

పోక్సో కేసు కావడంతో దర్యాప్తును పర్యవేక్షించే బాధ్యతను ఒక మహిళా ఐపీఎస్ అధికారికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దర్యాప్తును వృత్తిపరంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా నిర్వహించాలని సీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీసీపీ రితిరాజ్ ప్రతిరోజూ విచారణ పురోగతిని సమీక్షించి, రోజువారీ నివేదికను కమిషనర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేకుండా కేసులోని అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. తాజా ఉత్తర్వులతో విచారణ ప్రక్రియ వేగవంతం కానుంది. మరోవైపు ఈ కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ ఛైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి సైబరాబాద్ సీపీ నుంచి కేసు వివరాలను తెప్పించుకున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూసేందుకు విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఘటనపై పూర్తిస్థాయి నివేదికను కమిషన్‌కు అందజేయాలని పోలీసులను కోరింది.

చట్టం తన పని తాను చేస్తుంది : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామచందర్‌రావు

బండి భగీరథ్‌ కేసుపై బీజేపీ రాష్ట్ర నేత రామచందర్‌రావు స్పందించారు. ఈ కేసుతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. “బండి సంజయ్ మా నాయకుడు, కేంద్ర మంత్రి. కానీ ఈ కేసు ఆయన కుటుంబానికి సంబంధించిన అంశం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒకవేళ విచారణలో బండి సంజయ్ కుటుంబీకుల జోక్యం ఉన్నట్లు తేలితే వారిపైనా చర్యలు తీసుకోవచ్చు” అని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ ఘటనతో బండి సంజయ్‌కు ఏమైనా సంబంధం ఉంటే చట్టపరమైన చర్యలకు తాము సిద్ధమేనని వెల్లడించారు. ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.